ఇందులో ఎఫ్-16, ఎఫ్-15, ఎఫ్-18, ఎఫ్-35లు పోటీ పడుతున్నాయి.ఇప్పుడు అసలు సంగతిలోకి వస్తే — 2019లో బాలాకోట్ దాడి తర్వాత పాక్ ఎఫ్-16 కూలిందని వార్తలొచ్చాయి.కానీ ఏ అథెంటిక్ రిపోర్ట్ లేదు.ఇప్పుడు మరోసారి రాఫెల్ విమానం కూలిందని ప్రచారం మొదలైంది. అమెరికన్ మీడియా సంస్థ సీఎన్ఎన్ ఈ కథనాన్ని ప్రచురించింది.కానీ ఈ కథనానికి ఆధారం ఒక తప్పుడు ఇండియన్ వెబ్సైట్.అది మిరాజ్ విమానం జారవిడిచిన ఫ్యూయల్ ట్యాంక్ శకలాల్ని రాఫెల్ శకలాలుగా చూపించింది.దీన్ని ఆధారంగా తీసుకుని సీఎన్ఎన్ కథనం రాసింది.ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా? అసలు కాదు అన్న అనుమానాలే ఎక్కువ.ఎందుకంటే అంతర్జాతీయ ఆయుధ వ్యాపారంలో రాఫెల్, ఎఫ్-16 మధ్య పోటీ తీవ్రమైంది.ఇలాంటి సమయంలో రాఫెల్ మీద నెగెటివ్ వార్తలొస్తే, లాభం ఎఫ్-16 తయారీదారులకు — అంటే లాక్హీడ్ మార్టిన్కు.ఇదే తరహాలో పాకిస్తాన్ ఎఫ్-16ల్ని సరిహద్దు నుంచి దూరంగా తరలించింది. కారణం? భారత్ వద్ద ఉన్న ఎస్-400 వ్యవస్థ.పాక్ ఎఫ్-16ల్ని భారత్పై వాడకూడదని అమెరికా ఒప్పందంలో చెప్పింది. కానీ పాక్కు ఒప్పందాలు ఎంతవరకు పట్టించుకుంటుందో మనకూ తెలుసు.
ఇక చైనా, పాక్ కలిసి తమ జేఎఫ్-17, జే-10 విమానాలను ప్రమోట్ చేయడానికి ప్రచారం మొదలుపెట్టాయి.భారత యుద్ధ విమానాలను వీటితో కూల్చేశామంటూ వార్తలు వస్తున్నాయి. దీని వెనక చైనా చెంగ్దు కార్పొరేషన్ వ్యూహమే ఉంది.అసలు ఇది ఒక రకంగా ఆయుధ వ్యాపారం కోసం నడిచే సమాచార యుద్ధం.అయితే యుద్ధాల్లోనూ వేరే స్థాయి కుట్రలు జరుగుతాయి.ఒకే దేశానికి చెందిన కంపెనీలు కూడా ఒకదానిపై ఒకటి నెగెటివ్ ప్రచారం చేస్తాయి. అమెరికాలో లాక్హీడ్, బోయింగ్ మధ్య పోటీ ఒక ఎత్తు. కోప్ ఇండియా 2004లో ఎఫ్-15లు ఓడిపోయాయని కథనాలు వచ్చాయి. కానీ దాని వెనక ఎఫ్-22 అమ్ముకోవాలన్న వ్యూహమే ఉంది అని తర్వాత బహిర్గతమైంది.యుద్ధం జరిగితే వార్తల కంటే దాని వెనక కుట్రలే ఎక్కువ. ఆయుధ కంపెనీలకు తమ వ్యాపారమే ముఖ్యం. నిజం చెప్పాలనే నైతికత వారికి అవసరం ఉండదు. అందుకే సమాచార యుద్ధం ఇంకా ప్రమాదకరం.
Read Also : Mawra Hocane : ఆపరేషన్ సిందూర్ పై వ్యతిరేక కామెంట్స్ చేసిన మవ్రా హోకేన్