Microsoft Windows Updates: మైక్రోసాఫ్ట్ విండోస్ 11 లోని లేటెస్ట్ వెర్షన్లు (24H2, 25H2) అప్డేట్ చేసిన లక్షలాది మంది వినియోగదారులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అప్డేట్ తర్వాత సిస్టమ్లో లాగిన్ ప్రక్రియ సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత వినియోగదారులు తమ ఖాతాలను యాక్సెస్ చేయడంలో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
Read Also : US AI Policy: కొత్త ఏఐ పాలసీ తో భారత్ కు తిప్పలేనా ?

ఇంటర్నెట్ ఉన్నా ‘నో ఇంటర్నెట్’ ఎర్రర్: ప్రభావితమైన యాప్లు ఇవే
వినియోగదారుల వద్ద యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ ఖాతా ఆధారిత యాప్లైన వన్డ్రైవ్, ఎంఎస్ ఆఫీస్, టీమ్స్ వంటి వాటిలో ‘నో ఇంటర్నెట్’ (No Internet) అనే ఎర్రర్ మెసేజ్ కనిపిస్తోంది. అయితే, ఎంట్రా ఐడీ ని ఉపయోగించే ఎంటర్ప్రైజ్ లేదా బిజినెస్ వినియోగదారులు ఈ సమస్యతో ప్రభావితం కాలేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.
సమస్యకు పరిష్కారం ఎప్పుడు?
ఈ సాంకేతిక లోపాన్ని మైక్రోసాఫ్ట్ అధికారికంగా గుర్తించింది. దీనిని పరిష్కరించేందుకు తమ బృందం కృషి చేస్తోందని, త్వరలోనే ఒక ఫిక్సింగ్ అప్డేట్ను విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. అప్పటి వరకు తాత్కాలిక పరిష్కారంగా తమ పరికరాన్ని (PC/Laptop) ఒకసారి రీస్టార్ట్ (Restart) చేయాలని వినియోగదారులకు సూచించింది. ఇలా చేయడం ద్వారా కొంతవరకు సమస్య తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :