📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Latest News: MGR: తమిళనాడులో ఎంజీఆర్ విగ్రహం ధ్వంసం

Author Icon By Aanusha
Updated: October 6, 2025 • 8:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు (Tamil Nadu) లో దివంగత మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం నియోజకవర్గంలోని అవనియాపురం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Bihar Elections: మోగిన బీహార్ ఎన్నికలు

MGR

శనివారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎంజీఆర్ విగ్రహం (MGR statue) ముఖభాగాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆగ్రహావేశానికి లోనయ్యారు. వెంటనే పెద్ద ఎత్తున రహదారులపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.

ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం కార్యకర్తలు కిందపడి ఉన్న విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో నిలబెట్టారు. ఈ సంఘటనపై పార్టీ జిల్లా నాయకులు అవనియాపురం (Avaniapuram) పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.ఈ ఘటనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. ఎంజీఆర్ కీర్తిని, ఆయన సిద్ధాంతాలను రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్లే ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. నిందితులను తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news MGR statue vandalism Tamil Nadu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.