📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Revanth Reddy : చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి!

Author Icon By Divya Vani M
Updated: July 16, 2025 • 7:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Chandrababu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. సమావేశం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై ఎలాంటి చర్చ జరగలేదని రేవంత్ తెలిపారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై ఏ ప్రతిపాదన కూడ రాలేదన్నారు. ప్రతిపాదనే రాకపోతే ఆపాలని చర్చించడమెక్కడని ప్రశ్నించారు.ఈ సమావేశాన్ని అపెక్స్ కమిటీగా భావించొద్దని రేవంత్ స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక సమన్వయ సమావేశమేనన్నారు.

Revanth Reddy : చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి!

ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటుపై నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కొత్త కమిటీ ఏర్పాటవుతుంది. అధికారులు, ఇంజినీర్లతో కూడిన ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ సమస్యలపై లోతుగా అధ్యయనం చేస్తుందని తెలిపారు.గతంలో కేసీఆర్ పాలనలో తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలను సరిచేయడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామన్నారు.

కేంద్రం మధ్యవర్తిత్వమే చేసింది

ఈ సమావేశంలో కేంద్రం ఎవరి పక్షానా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేవలం సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరించిందని వివరించారు. రాష్ట్రాల మధ్య పటిష్టమైన చర్చ జరిగేందుకు కేంద్రం వేదిక మాత్రమేనన్నారు.ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న నీటి సమస్యలపై దృష్టి పెట్టిన సమావేశమిది. భవిష్యత్తులో ఇలాంటి అంశాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ చర్చ జరిగింది. రాష్ట్రాల మధ్య సమన్వయం పెరగాలనేదే దీని ప్రధాన ఉద్దేశమని రేవంత్ చెప్పారు.

Read Also : Vijayawada: విజ‌య‌వాడ‌లో ఇద్దరు యువకుల దారుణ హత్య

Andhra Pradesh Telangana Water Problems Apex Committee Banakacherla Project Chandrababu Godavari Krishna Water Discussion Jal Shakti Department Revanth Reddy telugu states Water Dispute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.