📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Maoist leader :ఎట్టకేలకు లొంగిపోయిన మల్లోజుల

Author Icon By Sushmitha
Updated: October 15, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మావోయిస్టు పార్టీలో దాదాపు రెండవ స్థానంలో చలామణి అవుతున్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, అలియాస్ సోను అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో,(Politburo,) సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడుగా ఉన్న మల్లోజుల, 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సాయుధ ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచారం నేపథ్యంలో మల్లోజుల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి తీరని నష్టంగా పరిగణించబడుతోంది.

Read Also: Guntakal: రైళ్లలో ఆకస్మిక తనిఖీలు ఒక్క రోజే రూ.కోటికి పైగా ఆదాయం

లొంగుబాటు నేపథ్యం, పార్టీపై విమర్శలు

మల్లోజుల గత కొన్ని రోజులుగా మావోయిస్టు(Maoist) పార్టీ వైఖరి సరిగా లేదంటూ బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమంటూ ఆయన అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి జనజీవనంలోకి అడుగుపెట్టారు. సీఎం ఫడ్నవీస్ సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజులపై వివిధ రాష్ట్రాల్లో వందకు పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

మల్లోజుల వేణుగోపాల్ ప్రస్థానం

మల్లోజుల వేణుగోపాల్ రావు సొంత రాష్ట్రం తెలంగాణ, పెద్దపల్లికి చెందినవారు. ఆయన తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 1970 దశకంలోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో పనిచేసిన ఆయన, ఆ తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్లారు. పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావుతో కలిసి పనిచేశారు. వేణుగోపాల్ ప్రధానంగా పొలిటికల్, ఐడియాలజికల్ లీడర్‌గా గుర్తింపు పొందారు. మిలిటరీ ఆపరేషన్స్ కంటే భావజాలం, ప్రకటనలు, లేఖల ద్వారా ఉద్యమాన్ని గైడ్ చేశారు. ఆయనపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు.

పార్టీలో ఉన్నత పదవులు

సీపీఐ (మావోయిస్టు)లో ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్‌గా మొదలై, పొలిట్‌బ్యూరో మెంబర్‌గా ఎదిగారు. ఉద్యమం యొక్క చీఫ్ స్పోక్స్‌పర్సన్, ఐడియాలజికల్ హెడ్‌గా పనిచేశారు. సెంట్రల్ మిలిటరీ(Military) కమిషన్ హెడ్ నంబాల కేశవ రావు (బసవరాజు) మరణం తర్వాత, సీపీఐ (మావోయిస్టు)ని లీడ్ చేసేందుకు ముందువరుసలో నిలిచారు.

మల్లోజుల వేణుగోపాల్ ఏ ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారు?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ఆయన లొంగిపోయారు.

ఆయనపై ఎంత రివార్డు ఉంది?

మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Devendra Fadnavis Google News in Telugu Latest News in Telugu Mallojula Venugopal Maoist insurgency. Maoist leader Surrender Telangana Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.