📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

మణిపూర్ హింస..ఉన్నతాధికారులతో అమిత్ షా అత్యవసర భేటీ

Author Icon By sumalatha chinthakayala
Updated: November 19, 2024 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ లో నెలకున్న పరిస్థితులపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. అల్లర్లకు కారణాలతో పాటు అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మైతీ వర్గీయుల అల్టిమేటమ్ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని హుటాహుటినా ఆదివారమే అమిత్ షా ఢిల్లీకి చేరుకుని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

ఇక సోమవారం కూడా అత్యవసర సమావేశం నిర్వహించి..పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు కొన్ని సూచనలను చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై జరిగిన దాడి గురించి ఆరా తీశారు. అక్కడి పరిస్థితిని బట్టి కర్ఫ్యూ విధించాలని ఆదేశించినట్లు సమాచారం. అల్లర్లు వ్యాపించకుండా అవసరమైతే మరికొన్ని జిల్లాల్లోనూ కర్ఫ్యూ అమలు చేయాలని, ఇంటర్నేట్ సేవలను కొన్ని రోజుల పాటు షట్ డౌన్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బ్రుందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేత్రుత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో నెలకున్న పరిస్థితిపై చర్చలు జరిపారు. శాంతిస్థాపనకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై ఎన్డీఏ మిత్రపక్ష పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అల్లర్లు నియంత్రించడంలో బీరెన్ సింగ్ విఫలం అయ్యారని ఆరోపిస్తూ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్డీఏకు తన మద్ధతును ఉపసంహరించుకున్నది. ఈ అంశంపై కూడా మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చర్చించారు.

high officials meeting Home Minister Amit Shah Manipur violence

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.