కుటుంబ అన్నాక మనస్పర్థలు సహజం. కోపతాపాలు కూడా సహజమే. కానీ అవి ఇతరుల ప్రాణాలను తీసేంతగా ఉండకూడదు. పరస్పర చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. లేకపోతే పెద్ద ఉపద్రవాలకు దారితీయవచ్చు. ఓ భర్త విషయంలో ఇదే జరిగింది.ఓ భార్య తన భర్తను హతమార్చేందుకు ప్రయత్నించింది. తన ఘాతుకం ఎవరికీ తెలియకూడదని పెద్ద స్కెచ్ వేసింది.
Read Also: Pawan Kalyan: ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

బురఖాతో వచ్చి హత్యకు యత్నం
ఇంకేం అనుకున్నట్లుగా తన ప్లాన్ ను అమలు చేసింది. ఎవరికీ దొరకూడదని చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, పోలీసులకు చిక్కింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బురఖాతో వచ్చి హత్యకు యత్నం మంగళూరులోని (Mangalore Crime) బంట్వాళ పట్టణంలో బట్టల దుకాణం యజమాని కృష్ణకుమార్ ను అతని భార్య జ్యోతి బురఖా వేసుకుని వచ్చి చంపిన సంఘటన సంచలనం రేపింది. బంట్వాళ పట్టణ నడిబొడ్డున ఉన్న బట్టల దుకాణంలోకి బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో కొనుగోలు దారులు పెద్దగా లేని సమయం అది. ఇంతలో ఓ మహిళ షాపులోనికి ప్రవేశించింది. బురఖా ధరించి, నోటికి అడ్డుగా మాస్క్ వేసుకేన్న ఆమె ఏవో దుస్తుల కోసం వెతుకుతున్నట్లు నటించింది. అనంతరం ఒక్కసారిగా కత్తి తీసి, కృష్ణకుమార్ పై దాడి చేసి, ఇష్టం వచ్చినట్లు పొడిచి పరుగులు తీసింది. అక్కడున్న వారు అప్రమత్తమై, బాధితుడిని మంగళూరులోని ఏజే ఆసుపత్రికి తరలించారు. మరికొందరు ఆమెను వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశారు.
పోలీసులకు చిక్కిన బురఖా లేడీ
పోలీసులకు (police) సమాచారం అందడంతో వారు ఆమెకోసం గాలించారు. చివరికి బంట్వాళ వీధుల్లో పట్టుకున్నారు. పోలీసు స్టేషన్ కు తరలించి, విచారించంతో పాటు ఆమె బురఖా తొలగించి ఆమె అసలు రూపం చూసి ఖంగుతిన్నారు. ఆమె ఎవరో కాదు.. స్వయంగా కష్ణకుమార్ భార్య జ్యోతి. పోలీసులు, షాప్ సిబ్బంది ఆమెను చూసి, నోరెళ్లబెట్టారు. కుటుంబంలో వివాదాల కారణంగానే ఆమె భర్తను హతమార్చేందుకు యత్నించినట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితురాలు ఇదే విషయాన్ని పోలీసుకులు తెలిపింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: