డాక్టర్ రేప్ కేసు : కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ అసహనం

Read Time:  1 min
kolkata doctor case
kolkata doctor case
FONT SIZE
GET APP

మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో దోషి సంజయ్ రాయ్కు కోల్‌కతా కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు సమాజానికి సందేశాత్మకంగా ఉండే తీర్పు కావాలని తమ ప్రభుత్వం భావించిందని కానీ జీవిత ఖైదు విధించడం మాకు ఏమాత్రం నచ్చలేదని , ఈ తీర్పు పట్ల తమ అసమ్మతి హైకోర్టులో అప్పీల్ ద్వారా తెలియజేస్తామని ఆమె స్పష్టం చేశారు.

కోర్టు తీర్పు వెలువడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుండి నిరసనలు వ్యక్తమయ్యాయి. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచేందుకు కఠినమైన శిక్షలు అవసరమని వారు డిమాండ్ చేసారు. ఈ కేసు దేశంలో మహిళల భద్రతపై మరోసారి చర్చలు రేకెత్తించింది. బాధితుల కోసం న్యాయం జరగాలని, దోషులకు కఠినమైన శిక్షలు విధించడం ద్వారా ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. న్యాయవ్యవస్థ వేగంగా న్యాయం చేయడం సమాజంలో ఆత్మవిశ్వాసం పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.