Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని దేవాలయాల పూజారులు మరియు మసీదుల ముజ్జిన్లకు (ముస్లిం మత గురువులు) ఇచ్చే నెలవారీ గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీరికి అందుతున్న వేతనాన్ని మరో రూ. 500 పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ పెంపుతో వీరి నెలవారీ భృతి ఇప్పుడు రూ. 2,000కు చేరుకుంది.
Read Also:TN Elections 2026: విజయ్కు బీజేపీ బంపర్ ఆఫర్.. 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి?
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, ప్రవర్తనా నియమావళి (Code of Conduct) అమల్లోకి రావడానికి కొద్ది గంటల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కేవలం వేతనాలను పెంచడమే కాకుండా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని కూడా ఈ గౌరవ వేతన పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అర్చకులు, మత పెద్దలకు లబ్ధి చేకూరనుంది.
అయితే, మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ దుమారం రేగుతోంది. కేవలం ఓటర్లను ఆకట్టుకోవడానికే ఎన్నికల తరుణంలో ఈ తరహా వరాలు కురిపిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. మతపరమైన అంశాలను ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఈ చర్య ద్వారా ఆధ్యాత్మిక వర్గాల మద్దతును కూడగట్టాలని భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: