📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Mamata Banerjee : అర్ధరాత్రి బదిలీలపై మమత ఆగ్రహం, ఈసీపై విమర్శ

Author Icon By Sai Kiran
Updated: March 16, 2026 • 8:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌లో కీలక ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ బదిలీలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు.

సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జేపీ మీనా, డీజీపీ మరియు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ చర్యపై స్పందించిన మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆమె మాట్లాడుతూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తనకు మెసేజ్ వచ్చిందని తెలిపారు. ఇలాంటి చర్యలు ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ ఒక బెంగాలీ మహిళ అని, ఆమెను తొలగించడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు.

ఈసీపై మమత ఆరోపణలు

గతంలో అధికారుల బదిలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముగ్గురు పేర్లతో జాబితాను ఈసీ కోరేదని మమత తెలిపారు. కానీ ఈసారి ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

ఇదేమైనా ఢిల్లీ లడ్డూ అనుకుంటున్నారా? ఇది వారి జాగీరా అని ఆమె ప్రశ్నించారు. డీజీపీగా ఉన్న పీయూష్ పాండే బెంగాలీ కాదని, ఆయనను కూడా తొలగించారని గుర్తు చేశారు.

Read also: West Bengal Election Schedule 2026: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

Mamata banerjee

కేంద్రంపై విమర్శలు

వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కోల్‌కతాలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా పనిచేసే అధికారులను మాత్రమే ఎంపిక చేస్తోందని ఆమె ఆరోపించారు.

రాష్ట్ర మంత్రి శశి పంజా ఇంటిపై దాడి జరిగినట్లే తన నివాసంపై కూడా దాడి చేసే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మారదని మమత వ్యాఖ్య

బెంగాల్‌లో ప్రభుత్వం మారదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మీరు ఎవరినైనా మార్చండి, ఎలాంటి చర్యలు తీసుకున్నా బెంగాల్‌లో ప్రభుత్వం మారదని ఆమె అన్నారు.

అదే సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే చర్యలకు లొంగవద్దని సూచించారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

election commission transfer issue Google News in Telugu Mamata Banerjee statement mamata vs ec controversy Telugu News West Bengal political news west bengal politics news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.