📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News :Mallikarjun Kharge: ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేయాలి : మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే

Author Icon By Sudha
Updated: October 31, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్‌)ను బ్యాన్ చేయాల‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) పిలుపునిచ్చారు. దేశంలో నెల‌కొన్న శాంతి, భ‌ద్ర‌త‌ల‌కు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌దే బాధ్య‌త అని ఆయ‌న విమ‌ర్శించారు. ఒక‌వేళ స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ అభిప్రాయాల‌ను ప్ర‌ధాని మోదీ నిజంగా గౌర‌విస్తే, అప్పుడు ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేయాల‌ని ఖ‌ర్గే (Mallikarjun Kharge)అభిప్రాయ‌ప‌డ్డారు. ఇవ‌న్నీ త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాలు అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేయాల‌ని ఓపెన్‌గా చెబుతున్న‌ట్లు తెలిపారు. ఢిల్లీలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు.

Read Also : http://Mysore crime: భర్తను చంపాలని యాక్సిడెంట్ నాటకం.. ఇట్టే దొరికిపోయిన భార్య

Mallikarjun Kharge


ఇందిరా గాంధీతో పాటు స‌ర్దార్ ప‌టేల్ కూడా దేశ ఐక్య‌త కోసం శ్ర‌మించిన‌ట్లు ఖ‌ర్గే తెలిపారు. శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీకి స‌ర్ధార్ ప‌టేల్ రాసిన లేఖ‌ను ఆయ‌న గుర్తు చేశారు. గాంధీ మృతి త‌ర్వాత ఆర్ఎస్ఎస్ సంబ‌రాలు చేసుకుంద‌ని, ఈ నేప‌థ్యంలో ఆ సంస్థ‌ను నిషేధించాల‌ని ఆ లేఖ‌లో కోరారు. గాంధీ హ‌త్య త‌ర్వాత ఆర్ఎస్ఎస్ స్వీట్లు పంపిణీ చేసిన‌ట్లు ఖ‌ర్గే తెలిపారు. సంఘ్ స‌భ్యుల ప్ర‌సంగాల్లో విషం ఉన్న‌ట్లు పేర్కొన్నారు. స‌ర్దార్ ప‌టేల్ ఇదే త‌ర‌హా లేఖ‌ను గోల్‌వాక‌ర్‌కు కూడా రాసిన‌ట్లు ఖ‌ర్గే వెల్ల‌డించారు.

మల్లికార్జున్ ఖర్గే తొలినాళ్ళ జీవితం?

మల్లికార్జున్ ఖర్గే 1942 జూలై 21న కర్ణాటకలోని బీదర్ జిల్లా భాల్కీ తాలూకాలోని వరవట్టిలో సాయిబవ్వ మరియు మాపన్న ఖర్గే దంపతులకు దళిత కుటుంబంలో జన్మించారు.అతను గుల్బర్గాలోని నూతన్ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, గుల్బర్గాలోని ప్రభుత్వ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని మరియు గుల్బర్గాలోని సేథ్ శంకర్‌లాల్ లాహోటి లా కళాశాల నుండి న్యాయ పట్టా పొందాడు. అతను జస్టిస్ శివరాజ్ పాటిల్ కార్యాలయంలో జూనియర్‌గా తన న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు మరియు తన న్యాయవాద వృత్తి ప్రారంభంలో కార్మిక సంఘాల కోసం కేసులను వాదించాడు

మల్లికార్జున్ ఖర్గే రాజకీయ జీవితం?

ఖర్గే రాష్ట్ర రాజకీయాల్లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు, 1972 నుండి 2008 వరకు వరుసగా గుర్మిట్కల్ అసెంబ్లీ నియోజకవర్గం మరియు చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన జీవితకాలంలో ఒకరిని మినహాయించి, తన ప్రత్యర్థి అభ్యర్థులందరినీ ఓడించిన రికార్డుకు ఆయన ప్రసిద్ధి చెందారు. 2023లో, ఆయన లోక్‌మత్ పార్లమెంటరీ అవార్డుల నుండి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు .

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News congress india latest news Mallikarjun Kharge Politics RSS Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.