📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

బీజేపీదే విజయమంటున్న మెజార్టీ ఎగ్జిట్ పోల్స్..!

Author Icon By sumalatha chinthakayala
Updated: February 5, 2025 • 7:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న కాషాయ పార్టీ.. ఆమ్‌ఆద్మీకి గట్టి పోటీ ఇచ్చింది. మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు ఆప్‌ కూడా తీవ్రంగా శ్రమించింది. కాంగ్రెస్‌ ప్రభావం మాత్రం పెద్దగా కనిపించలేదు. మొత్తంగా ఆప్‌, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలుండగా.. జేవీసీ పోల్‌ బీజేపీకి 39-45, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 32-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్‌ నౌ బీజేపీకి 39-45, ఆప్‌కి 22-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొంది. మ్యాట్రిక్స్‌ సంస్థ ఆప్‌కు 32-37, బీజేపీకి 35-40, కాంగ్రెస్‌కు 0-1 వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీ సర్వే ఆప్‌కు 25-28, బీజేపీకి 39,45, కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వస్తాయని చెప్పింది. పీపుల్స్‌ పల్స్‌ కాంగ్రెస్‌కు ఆప్‌కు 10-19, బీజేపీకి 51-60 వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్‌ ఇన్‌సైట్‌ ఆప్‌కు 25-29, బీజేపీకి 40-44, కాంగ్రెస్‌కు 0- ఒక స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేశాయి.

కాగా, 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ సారి మాజీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కు చెందిన సందీప్‌ దీక్షిత్‌, బీజేపీకి చెందిన ప్రవేశ్‌ వర్మ సైతం ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ఢిల్లీ సీఎం అతిషి మర్లేనా కల్కాజీ స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి బీజేపీ నుంచి రమేశ్‌ బిధురి పోటీ చేస్తున్నారు.

app BJP congress Delhi assembly election Majority exit polls

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.