📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

హత్య కేసు ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా

Author Icon By Anusha
Updated: March 4, 2025 • 2:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ ఇటీవలే దారుణంగా హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. కాగా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపింది.ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆయనను రాజీనామా చేయాలని ఆదేశించారని సమాచారం. ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ, ధనంజయ్ రాజీనామాను తాను ఆమోదించి, గవర్నర్‌కు పంపినట్లు తెలిపారు.

ధనంజయ్ రాజీనామా

మహారాష్ట్రలోని బీడ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ను డిసెంబర్ 9వ తేదీన కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆపై దారుణంగా హింసించి హత్యకు పాల్పడ్డారు. అయితే ఈ హత్య కేసు బయటకు రాగా దీంట్లో మంత్రి ధనంజయ్ ముండే హస్తం కూడా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈయన సహాయకుడు వాల్మిక్ కరాడ్ ఇందులో ప్రధానంగా ఇన్వాల్వ్ అయ్యారని తెలియగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. దీంతో మంత్రికి ఈ కేసుతో సంబంధం ఉందంటూ మరింతగా వార్తలు వచ్చాయి.

రాజీనామాను ఆమోదించిన ఫడ్నవిస్

రాజీనామా చేయాలని ఆయనను సీఎం ఫడ్నవిస్ ఆదేశించినట్టు సమాచారం. ఈ అంశంపై ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ ధనంజయ్ రాజీనామాను తాను ఆమోదించి, గవర్నర్ కు పంపానని తెలిపారు. 

ధనంజయ్ ముండే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలక నేతగా ఉన్నారు. సంతోష్ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురి చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కేసులో ధనంజయ్ సన్నిహితుడు వాల్మిక్ కరాడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ ధనంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.ప్రతిపక్షాలతో పాటు పలువురు మహాయుతి నాయకులు సైతం మంత్రి ధనంజయ్ ముండేపై విమర్శలు చేశారు. ఈ కేసులో మంత్రిని తప్పించేందుకు దర్యాప్తు అధికారులు, స్థానిక రాజకీయ నేతలు కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ గొడవ చేశారు. ముఖ్యంగా మంత్రి ధనంజయ్ ముండేకు గట్టి మద్దతు ఇస్తున్న ఎస్సీపీ చీఫ్ అజిత్ పవార్ సహా మంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను తాను సమర్పించినట్లు సామాజిక కార్యకర్త అంజలి దమానియా చెప్పడంతో గొడవ మరింత ఎక్కువైంది.

ఎన్సీపీ (శరద్ పవార్) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కూడా ధనంజయ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ధనంజయ్ మాట్లాడుతూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం ఫడ్నవిస్ లేదా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్తే వెంటనే రాజీనామా చేస్తానని అన్నారు. ఈ క్రమంలో చివరకు ఆయన రాజీనామా చేశారు.

#AjitPawar #BeedDistrict #crimenews #DevendraFadnavis #DhananjayMunde #MaharashtraNews #MaharashtraPolitics #NCP #PoliticalCrisis #Resignation #SantoshDeshmukhMurder #SupriyaSule Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.