మహారాష్ట్ర (Maharashtra Crime) బీజేపీ మంత్రి పంకజ ముండే పీఏ అనంత్ గాడ్జే భార్య డాక్టర్ గౌరీ పాల్వే ఆత్మహత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది. శనివారం సాయంత్రం ముంబైలోని తన నివాసంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి స్తున్నాయి. గౌరీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంత్ గార్జేతో పాటు అతని కుటుంబంలోని మరో ఇద్దరు సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం అర్థరాత్రి వర్లి పోలీసులు అనంత్ గార్డేను అరెస్టు చేశారు.
Read Also: Telangana: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ఎప్పనుంచి వీక్షించవచ్చంటే

దంపతుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు
అనంత్ గార్జ్ విచారణలో గౌరీ ఆత్మహత్య చేసుకునే కొన్ని నిమిషాల ముందు దంపతుల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. గొడవ అనంతరం పంకజ ముండే కార్యక్రమానికి వెళ్లిపోయారు అనంత్. అనంతరం గౌరీకి పదేపదే ఫోన్ చేసిన ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. అంతలోనే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా భర్త అనంత్ గార్జ్ వివాహేతర సంబంధాలే గౌరీ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది తిరగకముందే విషాదం జరగడం తీవ్రంగా కలచివేస్తున్న ఘటన.
పెళ్లికి ముందే అనంత్ కు వివాహేతర సంబంధాలు
అనంత్ గార్డేకు పెళ్లికి ముందే మరో మహిళతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. గౌరీకి భర్త వాట్సాప్ లో (WhatsApp) కొన్ని ఫొటోలు కనిపించాయి. లాతూరులోని ఒక ఆసుపత్రికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. 2021 నాటి ఆ పత్రంలో గర్భధారణ సమ్మతి, డిక్లరేసన్ ఫామ్ ఉండగా, అందులో మహిళ పేరు కిరణ్, భర్త పేరు అనంత్ గార్జ్ అని ఉంది. ఈ పత్రం అనంత్ వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేసింది. దీంతో తండ్రి ఆమెను ఇంటికి రమ్మని అడగ్గా అనంత్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లుగా తెలుస్తోంది. భార్య ఆత్మహత్యకు అనంత్ కు మరో మహిళతో ఉన్న సంబంధమే కారణమని గౌరీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: