Tamil Nadu political row : తిరుప్పరంకుండ్రంలో కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలి అనే అంశంతో మొదలైన వివాదం ఇప్పుడు న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, మత సంస్థల మధ్య పెద్ద మంటలా మారింది.
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ ఉత్తర్వులు తమిళనాట తీవ్ర రాజకీయ, న్యాయ కలకలం రేపడంతో ఆయనపై ఇంపీచ్మెంట్ తీర్మానం తీసుకురావాలని డీఎంకే ఎంపీలు భావిస్తున్నారు. ఈ నిర్ణయానికి కారణం—తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదమే.
ఏమిటి ఆ ఉత్తర్వు?
డిసెంబర్ 4న సాయంత్రం 6 గంటల లోపు తిరుప్పరంకుండ్రంలోని “దీపతూన్” అనే శిలపై కార్తీక దీపాన్ని వెలిగించాలని జస్టిస్ స్వామినాథన్ ఆదేశించారు. ఈ దీపతూన్, సికందర్ బాదుషా దర్గా సమీపంలో ఉండడం వల్ల ఇది సున్నిత ప్రాంతంగా పరిగణించబడుతోంది.
సాధారణంగా కార్తీక దీపాన్ని కొండపై ఉన్న ఉచిపిళ్లయ్యార్ ఆలయం దగ్గర దీప మండపంలో వెలిగిస్తారు. కానీ ఈసారి నలుగురు పిటిషనర్లు దీపతూన్ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి కోరగా, న్యాయమూర్తి అభ్యంతరాలు తిరస్కరించారు.
దీపం వెలిగించడం (Tamil Nadu political row) వల్ల దర్గాకు చెందిన ముస్లింల హక్కులకు ఎటువంటి భంగం కలగదని, కానీ అలా చేయకపోతే ఆలయానికి సంబంధించిన భూవివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు?
ఈ ఉత్తర్వు వల్ల శాంతిభద్రతలకు భంగం కలగవచ్చని భావించిన తమిళనాడు ప్రభుత్వం దీన్ని అమలు చేయడానికి నిరాకరించింది.
Read Also: Sairat Movie: ఇండియన్ బాక్సాఫీస్ను కుదిపేసిన ‘సైరాట్’ సక్సెస్ స్టోరీ
డీఎంకే అభ్యంతరాలు ఏమిటి?
- ఈ ఉత్తర్వు 2017లో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు పూర్తి విరుద్ధమని డీఎంకే పేర్కొంది.
- అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలలే ఉన్న సమయంలో ఇది మత ఉద్రిక్తతలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
- ఈ అంశంపై లోక్సభలో కూడా చర్చ జరిగింది. డీఎంకే నేత టి.ఆర్. బాలు, తమిళనాట మత చిచ్చు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఘర్షణలు ఎలా జరిగాయి?
డిసెంబర్ 4న హిందూ మక్కల్ కచ్చి, హిందూ తమిళర్ కచ్చి, హనుమాన్ సేన, హిందూ మున్నాని వంటి హిందూ సంఘాల కార్యకర్తలు దీపం వెలిగించేందుకు కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
దీపం వెలిగించకపోవడంతో ఆలయం ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సుప్రీంకోర్టు ఏమన్నది?
ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు ఉత్తర్వుపై తుది తీర్పు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం చేతుల్లో ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: