News Telugu: MadhyaPradesh: చనిపోతూ కసి తీర్చుకున్న పాము.. మృత్యువు చేరుకున్న యువతీ

Read Time:  1 min
MadhyaPradesh
MadhyaPradesh
FONT SIZE
GET APP

MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తుండగా ఓ యువతి విషపూరిత పాముకాటుతో (snake bite) మృతి చెందింది. ఈ ఘటన మురైనా జిల్లా సబల్‌గఢ్‌ సమీపంలోని గ్రామంలో ఆదివారం జరిగింది. భర్తి కుశ్వాహా అనే యువతి ఉదయం ఇంటి బయట గడ్డి కట్ చేయడానికి గ్రాస్‌ కట్టర్‌ ఉపయోగించింది. గడ్డిలో దాగి ఉన్న పామును (snake) ఆమె గమనించలేదు. కట్టర్‌ తాకడంతో పాము మూడు ముక్కలైంది. కానీ తల భాగం ఇంకా కదులుతుండగా, ఆ పాము చివరి శ్వాసలోనే కుశ్వాహాను కాటేసింది.

Read also: Supreme Court:డిజిటల్ అరెస్ట్’ మోసాలపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు  నోటీసులు

 MadhyaPradesh

MadhyaPradesh: చనిపోతూ కసి తీర్చుకున్న పాము

MadhyaPradesh: విషం వేగంగా శరీరమంతా వ్యాపించడంతో ఆమె అపస్మారక స్థితిలో పడిపోయింది. కుటుంబ సభ్యులు తొలుత స్థానిక వైద్యుడిని సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు గ్రాస్‌ కట్టర్‌ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురైనా జిల్లా సబల్‌గఢ్ సమీపంలోని గ్రామంలో జరిగింది.

యువతికి పాము ఎలా కాటేసింది?
గడ్డిని గ్రాస్ కట్టర్‌తో కత్తిరిస్తుండగా పాము మూడు ముక్కలైంది. తల భాగం కదులుతూ యువతిని కాటేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.