Telugu News: Madhya Pradesh Crime: ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ఆరోగ్య పరిస్థితి విషయం

Read Time:  1 min
Madhya Pradesh Crime
Madhya Pradesh Crime
FONT SIZE
GET APP

మనదేశంలో మహిళలకు కాదు చిన్న పిల్లలకు కూడా భద్రత కొరవడుతున్నది. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు వారిపై లైంగిక దాడులకు తెగిస్తున్నారు. కామాంధులను శిక్షించేందుకు చట్టాలు ఎన్నో ఉన్నా అగయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆరేళ్ల బాలికపై కామాంధుడు చేసిన అత్యాచారం తీవ్ర కలకలం రేపుతున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh Crime) రైసెన్ జిల్లాలోని గౌహర్ గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై సల్మాన్ అలియాస్ నాజర్ అనే వ్యక్తి లైంగిక దాడికి పూనుకున్నాడు. దీంతో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 

Read Also: Delhi Air Pollution: తీవ్ర కాలుష్యం: పౌరుల ఆరోగ్యంపై పెను ప్రభావం

Madhya Pradesh Crime
Madhya Pradesh Crime Rape of a six-year-old girl.. Health condition a matter

ఈ సంఘటన జరిగిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. అతడిని వెంటనే అరెస్టు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తూ విస్తృతంగా నిరసనలు జరిగాయి. దీంతో పోలీసులు  అప్రమత్తమయ్యారు. సంఘటన జరిగిన ఏడవ రోజున నిందితుడు నాజర్ను అరెస్టు చేశారు. భోపాల్ లోని గాంధీనగర్ లో అరెస్టు చేసిన రైసెన్ కు తరలిస్తుండగా కిరాత్ నగర్ గ్రామం సమీపంలో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.

నిందితుడిపై పోలీసుల రూ.30 వేల బహుమతి

భోపాల్ లోని గాంధీనగర్ వార్డ్ నంబరు 11లో ఒక టీ స్టాల్ వద్ద సల్మాన్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గోహర్ గంజ్ పోలీసులు నిందితుడిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. అయితే మార్గంలో నిందితుడు

తప్పించుకునేందుకు యత్నించగా అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడి కాలుకు బుల్లెట్ గాయం అయింది. అక్కడి నుంచి భోపాల్ లోని జేపీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఎయిమ్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలిక శరీరం తీవ్రంగా నలిగిపోయింది. పూర్తిగా కోలుకోవడానికి చాలా నెలలు పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.