గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు అయిపోయాయని, త్వరలోనే బంకులన్నీ మూతపడతాయని, గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగనున్నాయని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల ప్రభావంతో చాలా చోట్ల పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూ కట్టడం మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. పెట్రోల్ కొరత లేదు – ఆయిల్ కంపెనీల భరోసా భారత్ పెట్రోలియం (BPCL), ఇండియన్ ఆయిల్ (IOCL) సంస్థలు ఈ పుకార్లపై సోషల్ మీడియా వేదికగా స్పందించాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం పుకార్లేనని తేల్చి చెప్పాయి. భారత్ వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా గొలుసులో ఎలాంటి ఆటంకాలు లేవని భరోసా ఇచ్చాయి. ప్రజలు అనవసరంగా కంగారు పడి బంకుల దగ్గర గుమిగూడ వద్దని కోరాయి. ప్రభుత్వం, అధికారిక సంస్థలు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించాయి.
Read Also: T20 World Cup: సంబరాల్లో భారత్
Gas cylinder price: Has the price of gas cylinder increased? Oil companies’ clarity on this news
గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలం
వంట గ్యాస్ ధరల పెంపుతో షాక్ ఒకవైపు పెట్రోల్ ధరల విషయంలో ఊరట లభించినా, మరోవైపు వంట గ్యాస్ ధరలు (gas cylinder price) సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు సంస్థలు గ్యాస్ ధరలను పెంచాయి. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరపై రూ. 60 పెరిగింది. దీంతో ఢిల్లీ వంటి నగరాల్లో సిలిండర్ ధర రూ. 853 నుండి రూ. 913 కు చేరుకుంది. అలాగే కమర్షియల్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 114.5 పెరగడం గమనార్హం. అంతర్జాతీయ పరిణామాలు, ప్రభావం మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలం అవుతోంది. చమురు సరఫరా అయ్యే ప్రధాన మార్గాల్లో ఆటంకాలు కలగవచ్చనే భయంతో ముడిచమురు ధరలు మండుతున్నాయి. దీని ప్రభావం నేరుగా మన దేశంలోని పెట్రోల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలపై పడుతోంది. షేర్ మార్కెట్లో కూడా ఆయిల్ కంపెనీల షేర్లు ఈ పరిణామాల వల్ల నష్టాల్లో ముగిశాయి. సామాన్యులు మాత్రం ఈ ధరల పెరుగుదల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :