నవీముంబైలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, యువజనశాఖ మంత్రి నారా లోకేశ్ ఐసీసీ ఛైర్మన్ జైషాను కలిశారు. తన భార్య, టీడీపీ నాయకి నారా బ్రాహ్మణితో కలిసి జైషా మరియు ఆయన తల్లి సోనాలీ షాలను మర్యాదపూర్వకంగా కలిసి అభివందనాలు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా దేశంలో క్రికెట్ విస్తరణ, యువతలో క్రీడలపై ఆసక్తి పెంపు, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు లోకేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Latest News: Manuguru: మణుగూరులో రాజకీయ మంటలు — బీఆర్ఎస్-కాంగ్రెస్ ఘర్షణ ఉదృతం
లోకేశ్ తన సోషల్ మీడియా పోస్టులో, “భారత క్రికెట్ భవిష్యత్తు గురించి జైషాతో అద్భుతమైన చర్చ జరిగింది. క్రీడలు యువతలో శక్తి, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందిస్తాయి. ఆ దిశగా భారత్ క్రీడా రంగంలో ముందుకు సాగుతుందని విశ్వసిస్తున్నాను” అని పేర్కొన్నారు. జైషా కూడా లోకేశ్ దంపతులను కలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. క్రీడా రంగం అభివృద్ధికి ప్రభుత్వాలు, బోర్డులు కలిసి కృషి చేయాల్సిన అవసరాన్ని ఇరువురూ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఇక మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం లోకేశ్, బ్రాహ్మణి నేరుగా స్టేడియంకు చేరుకున్నారు. భారత జట్టుకు మద్దతుగా టీమిండియా జెర్సీలు ధరించి మ్యాచ్ను వీక్షించారు. సచిన్ టెండూల్కర్తో పాటు పలువురు ప్రముఖులను కలుసుకుని సంభాషించారు. క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా, మహిళా క్రీడాకారిణుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో భాగంగా ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారని లోకేశ్ సమీక్షించారు. ఈ సందర్భంగా మహిళా జట్టుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/