📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Waqf Bill : వక్ఫ్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Author Icon By sumalatha chinthakayala
Updated: April 3, 2025 • 7:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Waqf Bill: సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ‌ చర్చ జరిగింది. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం, అర్ధరాత్రి తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది దీనిని వ్యతిరేకించారు. అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ దద్దరిల్లిపోయింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది.

అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు

బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్‌సభ భేటీ కొనసాగడం ఇదే మొదటిసారి. కాగా, ఈ బిల్లుకు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన (షిండే) లోక్ జనశక్తి పార్టీ ( రామ్ విలాస్) మద్దతిచ్చారు. మరో వైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి.

ఆమోదం కోసం వక్ఫ్‌ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు

తీవ్ర నిరసనను ప్రకటించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బిల్లు పేపర్లను చించివేశారు. చర్చ, ఆమోదం కోసం వక్ఫ్‌ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. అయితే.. వక్ఫ్ భూముల పరిరక్షణ, పరిపాలనను బలోపేతం చేసే లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు కేంద్రం ప్రకటించింది. అక్రమ ఆక్రమణలు, అవినీతిని నివారించేందుకు కొత్త నిబంధనలు, వక్ఫ్ బోర్డు అధికారాలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. వివాదాస్పద భూముల పరిష్కరానికి సమర్థవంతమైన విధానాలు ఈ బిల్లు సూచిస్తుందని తెలిపింది.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Lok Sabha Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Waqf Amendment Bill

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.