📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Telugu News: Local BodyElections: పేరుకే మహిళలు.. పెత్తనం పురుషులదే!

Author Icon By Pooja
Updated: December 15, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో( Local BodyElections) మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, గెలిచిన మహిళా ప్రజాప్రతినిధుల అధికారాలను వారి భర్తలు లేదా ఇతర పురుష కుటుంబ సభ్యులు వినియోగిస్తున్న పరిస్థితులు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) గమనించింది. మహిళల పేరుతో పదవులు ఉన్నా, నిర్ణయాలు మాత్రం పురుషులే తీసుకుంటుండటంతో మహిళా సాధికారత భావన కేవలం పేరుకే పరిమితమవుతోందని కమిషన్ వ్యాఖ్యానించింది.

Read Also: TG: పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో తేలిన సర్పంచ్‌ విజయాలు

Local BodyElections

గ్రామ పంచాయతీలు( Local BodyElections), మున్సిపాలిటీల్లో చాలాచోట్ల మహిళా సర్పంచులు, అధ్యక్షులు విధుల్లో ఉన్నప్పటికీ వాస్తవ పరిపాలన ‘సర్పంచ్ పతి’ లేదా ‘ప్రాక్సీ పాలన’ రూపంలో నడుస్తోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. ఇది మహిళల రాజ్యాంగ హక్కులకు, సమానత్వానికి విఘాతం కలిగించే అంశమని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో, మహిళా ప్రతినిధులు స్వతంత్రంగా విధులు నిర్వర్తించేలా తీసుకుంటున్న చర్యలపై వివరాలు ఇవ్వాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ సమస్యను నివారించేందుకు చేపట్టిన చట్టపరమైన చర్యలు, అవగాహన కార్యక్రమాలు, శిక్షణా ప్రణాళికలపై ఈ నెల 22లోపు సమగ్ర నివేదికలు సమర్పించాలని స్పష్టం చేసింది.

మహిళలకు కేవలం రిజర్వేషన్‌ మాత్రమే కాకుండా నిజమైన అధికార, స్వేచ్ఛా పాలన కల్పించాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రజాస్వామ్యంలో మహిళల పాత్ర బలపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.