యువతీ యువకుల సహజీవనం (Live-in Relationship) విషయంలో రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) ఒక సంచలన తీర్పును వెలువరించింది. వివాహ వయస్సు (Marriageable Age) ఇంకా రాకున్నా సరే, యువతీ యువకులు మేజర్లైతే (Majority Age) పరస్పర ఆమోదంతో సహజీవనం చేయొచ్చని కోర్టు స్పష్టం చేసింది. వివాహ వయస్సు రాలేదన్న ఏకైక కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన స్వేచ్ఛా హక్కును (Right to Liberty) కాదనలేమని న్యాయస్థానం పేర్కొంది.
Read Also: Pak-Afg: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భారీ కాల్పులు
ఈ మేరకు, 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడి సహజీవనం కేసులో విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. యువకుడికి వివాహ వయస్సు (21 ఏళ్లు) రాలేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని నిషేధించలేమని, దీనిని నేరంగా కూడా పరిగణించలేమని జస్టిస్ అనూప్ ధండ్ స్పష్టం చేశారు.
యువతి కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం
కోర్టును ఆశ్రయించిన ఈ యువ జంట, తామిద్దరూ పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్నామని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, యువతి కుటుంబ సభ్యులు తమ సంబంధాన్ని వ్యతిరేకిస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు తగిన రక్షణ కల్పించాలని యువకుడు కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ జంట ఆరోపించింది.
ఈ నేపథ్యంలో, యువతి కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందన్న యువకుడి ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆ జంటకు తక్షణమే రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: