📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Omar Abdullah : లెఫ్టినెంట్ గవర్నర్‌ ప్రమోట్‌ అయ్యారు.. నేను డిమోట్‌ అయ్యాను : జమ్మూకాశ్మీర్ సీఎం

Author Icon By Sudha
Updated: June 6, 2025 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir)కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై చర్చించారు. అయితే, ఈ సమావేశం అనంతరం ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. లెఫ్టినెంట్ గవర్నర్‌ (Lieutenant Governor)ప్రమోట్‌ కాగా తాను డిమోట్‌ అయ్యానని జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా అన్నారు.

Omar Abdullah : లెఫ్టినెంట్ గవర్నర్‌ ప్రమోట్‌ అయ్యారు.. నేను డిమోట్‌ అయ్యాను : జమ్మూకాశ్మీర్ సీఎం


ప్రధానితో అనుబంధం
శుక్రవారం చీనాబ్ వంతెన, కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌లోని అన్ని రైల్వే ప్రాజెక్టుల్లో ప్రధానితో అనుబంధం కలిగి ఉండటం తన అదృష్టమని అన్నారు.
రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలి
మొదటిది అనంతనాగ్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం, రెండవది బనిహాల్ రైల్వే టన్నెల్ ప్రారంభోత్సవంలో తాను పాల్గొన్నట్లు ఒమర్‌ అబ్దుల్లా గుర్తుచేశారు. ‘2014లో కాట్రా రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇదే నలుగురు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పదోన్నతి పొందారు. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కేంద్రపాలిత ప్రాంతం సీఎంగా నన్ను తగ్గించారు. కానీ మనకు తెలియకముందే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తారు’ అని అన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను మోదీ ముందు ఇలా ప్రస్తావించారు.

Read Also:Narendra Modi: చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

Breaking News in Telugu Google news Google News in Telugu I have been demoted Jammu and Kashmir CM Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.