ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో భయంకర ఉగ్రదాడి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని భద్రతా వర్గాలు గుర్తించాయి. ఇది కశ్మీర్లో యాక్టివ్ ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల ఉనికి పట్ల కేంద్రాన్ని మరింత అప్రమత్తం చేసింది.
బస్కుచాన్లో కీలక ఆపరేషన్ – లొంగిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు
ఈ దాడి తర్వాత భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్(Jammu and Kashmir) పోలీసుల మధ్య సక్రమ సమన్వయం కుదిరి ఉగ్రవాదులపై ఒక విస్తృత స్థాయి ఆపరేషన్ ప్రారంభమైంది. కశ్మీర్లోని షోపియాన్ జిల్లా బస్కుచాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న తోటలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. దాంతో వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్లో లష్కరే తోయిబాకు చెందిన ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలామ్ లొంగిపోయారు. వారి నుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 2 హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర మందుగుండు సామాగ్రితో పాటు కొంత నగదు స్వాధీనం చేసుకున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరమైన యాంటీ టెరర్ ఆపరేషన్లు
పహల్గామ్ దాడికి ముందు మరియు తర్వాత, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఏకదాటి దాడుల వల్ల భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండగా, ఈ నెల ప్రారంభంలో షోపియాన్, త్రాల్, పుల్వామా వంటి ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు మట్టుబడ్డారు. మొత్తంగా ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 26 మంది ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో మరణించారు. ఈ నెల ప్రారంభంలో షోపియాన్, పుల్వామాలోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లలో ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.
Read also: Supreme Court: ఆమె ఇష్టంతోనే అతడితో వెళ్ళింది.. సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు