కేంద్ర ప్రభుత్వం రానున్న జనాభా గణనలో కులాల వారీగా వివరాలను సేకరించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమకు గర్వకారణమని పేర్కొన్నారు. “మేము రిజర్వేషన్లు, కుల గణన, సమానత్వం లాంటి విషయాలపై 30 ఏళ్ల కిందటే చర్చలు ప్రారంభించాం. ఇప్పుడు కేంద్రం మా ఆలోచనలే అనుసరిస్తోంది,” అని వ్యాఖ్యానించిన లాలూ, గతంలో తమను విమర్శించినవారికి ఇది గట్టి సమాధానమని పేర్కొన్నారు.
Read Also : Caste Census : కేంద్ర కాంగ్రెస్ కులగణనకు మీము సపోర్ట్ ఇస్తాం – రాహుల్
ఈ నిర్ణయం రాజకీయ విజయం
లాలూ కుమారుడు మరియు ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వి యాదవ్ కూడా ఈ పరిణామాన్ని పార్టీకి ఉన్న రాజకీయ విజయంగా అభివర్ణించారు. గతంలో ప్రధాని మోదీ కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు కేంద్రం తాము అడిగిన దిశగానే చర్యలు తీసుకోవడం తమ విజయాన్ని సూచిస్తోందని తెలిపారు. బీహార్ మహాకూటమి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కుల గణన చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది దేశవ్యాప్తంగా సమానత్వాన్ని స్థాపించే చర్యలలో ఒక ముఖ్యమైన అడుగు అని అభిప్రాయపడ్డారు.
కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ కూడా హర్షం వ్యక్తం చేసింది. కులాల వారీగా గణాంకాలను సేకరించాలన్నది తమ చిరకాల డిమాండ్ అని కాంగ్రెస్ నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ గణనతో సామాజిక న్యాయం అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజాపక్షాలైన ఆర్జేడీ మరియు కాంగ్రెస్ పార్టీల్లో ఆనందం వెల్లివిరిసింది.