📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

KSRTC Bus Conductor: బస్సులో నిద్రపోతున్న యువతిని లైంగికంగా వేధించిన కండక్టర్

Author Icon By Sudheer
Updated: April 25, 2025 • 1:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంగళూరు నగరంలో కదులుతున్న బస్సులో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కండక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వ్యక్తిని ప్రదీప్ కశప్ప నాయక్‌గా గుర్తించారు. ముడిపు నుంచి నగరానికి వస్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల్లో ఒకరు ఈ ఘటనను వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసులు స్పందించారు. వీడియోలో మహిళ నిద్రలో ఉండగా, కండక్టర్ ఆమెకు దగ్గరగా నిల్చొని, ఆమె శరీరంపై అశ్లీలంగా చేయి వేసినట్లు స్పష్టంగా కనిపించింది.

ఈ వీడియో ఆధారంగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 74 (మహిళపై దాడి లేదా అశ్లీలంగా ప్రవర్తించడం) మరియు సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి, 15 రోజుల న్యాయహిరాసతకు పంపించారు. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకొని అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

కెఎస్‌ఆర్‌టీసీ విభాగం ఈ ఘటనపై స్పందించి, ప్రదీప్ నాయక్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. డిసిప్లినరీ విచారణ పూర్తయ్యే వరకు ఆయన సేవలను నిలిపివేసినట్లు తెలిపారు. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఈ విషయంపై కెఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాస్తూ, విచారణను త్వరగా పూర్తి చేసి బాధితుడిని ఉద్యోగం నుంచి తొలగించాలని సూచించారు. “ప్రయాణికులకు కెఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది పట్ల గౌరవం ఉంటుంది. కొంతమంది తప్పుదారులు పడటంతో సంస్థ ప్రతిష్ఠకు భంగం కలుగుతోంది” అని మంత్రి పేర్కొన్నారు.

Google News in Telugu harassing woman KSRTC bus conductor Mangaluru

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.