బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అంటే తెలియని వారుండరు. బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని పొందారు.అమిత్ వల్లే కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమం బిగ్ సక్సెస్ అయ్యింది.. అలాంటి మహానటుడికి బెదిరింపులు వచ్చాయి.ఇటీవల అమితాబ్ బచ్చన్ కు ఖలీస్తానీ అనుబంధ సంస్థ నుంచి బెదిరింపులు రావడంతో, ముంబైలోని ఆయన నివాసం వద్ద భద్రతను గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
Read Also: Supreme Court: వీధికుక్కల కేసు.. అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇటీవల కౌన్ బనేగా కరోడ్పతి షోలో పాల్గొన్న దిల్ జిత్ దోసాంజ్ (Diljit Dosanjh), గౌరవ సూచనంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కాళ్లకునమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు. దిల్ జిల్ చర్య 1984 నాటి సిక్కుల వ్యతిరేక హింసలో మరణించిన వారిని అవమానించినట్లేనని ఎస్ ఎఫ్ సంస్థ ఆరోపించింది.

కాళ్లకు నమస్కారాన్ని వ్యతిరేకించిన ఎస్ ఎఫ్
1984 నాటి ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన హింసలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) రక్తం అనే నినాదాన్ని ఇచ్చి హిందు గుంపులను ప్రేరేపించారని ఎస్ ఎఫ్ ఆరోపిస్తోంది. ఈ కారణంగానే దిల్ జిత్ ఆయన పాదాలను తాకడాన్ని ఎస్ ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఖలీస్తానీ సంస్థ (Khalistani organization) అధినేత గుర్ పత్వంత్ సింగ్ పన్నూన్ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో అమితాబ్ బచ్చన్ భద్రతకు ముప్పు పొంచి ఉందనే అంచనాతో కేంద్ర ప్రభుత్వం ముంబైలోని ఆయన నివాసం వద్ద భారీగా భద్రతను పెంచాలని నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: