📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Kerala: స్కూటర్​లో దాక్కున్న పాము: ‌ ప్రాణాలతో బయటపడ్డ భయానక ఘటన

Author Icon By Pooja
Updated: November 2, 2025 • 2:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేరళలోని(Kerala) కాసర్‌గోడ్ జిల్లాలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు నిజంగానే ప్రాణాపాయంలో నుంచి బయటపడింది. ఆమె రోజూ స్కూటర్‌పై కాలేజీకి వెళ్తుంటారు. ఆ రోజు కూడా ఎప్పటిలాగే స్కూటర్ ఎక్కి బయలుదేరారు. నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడి బ్రేక్‌ పెడల్‌ దగ్గర ఏదో కదులుతున్నట్టు అనిపించింది. దగ్గరగా చూసేసరికి విషపూరిత పాము ఉందని గమనించి షాక్‌కి గురయ్యారు.

Read also:  Chhattisgarh Visit: పర్యటనలో ప్రధాని మోదీ – అభివృద్ధి ప్రాజెక్టుల పై దృష్టి

ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేసిన విషపూరిత పాము

తైకదప్పురం ప్రాంతానికి చెందిన షర్ఫునిసా అనే ఆ టీచర్‌ నెహ్రూ కాలేజీలో(Nehru College)(Kerala) బోధిస్తారు. పాము కాటు వేస్తుందేమోనని భయపడ్డా, ధైర్యంగా ఇంకో కిలోమీటర్‌ వరకు స్కూటర్‌ను నడిపి కాలేజీకి చేరుకున్నారు. తర్వాత మెకానిక్‌ సహాయంతో వాహన భాగాలను విప్పించగా, లోపల దాక్కున్న పాము బయటకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్నవారందరూ షాక్‌ అయ్యారు. ఈ సంఘటన తర్వాత షర్ఫునిసా మాట్లాడుతూ — “ఇకపై స్కూటర్‌ దగ్గరికి వెళ్లే ప్రతీసారి భయంగా ఉంటుంది. ప్రతి సారి వాహనాన్ని వాడే ముందు చెక్‌ చేసుకోవాలి” అని అన్నారు.

నిపుణుల సూచన ప్రకారం అక్టోబర్‌ నుంచి జనవరి వరకు పాములు ఎక్కువగా సంచరిస్తాయి. ఈ సమయంలో కోబ్రా, రక్తపింజర లాంటి విషపూరిత జాతులు ఇళ్ళు, షూలు, వాహనాల్లోకి చొరబడే అవకాశముంది. కాబట్టి ప్రతీసారి వాహనాలు, పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించాలని స్నేక్‌ క్యాచర్‌ కేటీ సంతోష్‌ హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu ShockingIncident SnakeInScooter ViralNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.