हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Sarada Muraleedharan : వర్ణ వివక్షపై కేరళ సీఎస్‌ బహిరంగలేఖ

sumalatha chinthakayala
Sarada Muraleedharan : వర్ణ వివక్షపై కేరళ సీఎస్‌ బహిరంగలేఖ

Sarada Muraleedharan: కేరళ చీఫ్‌ సెక్రటరీ శారదా మురళీధరన్‌ ఫేస్‌బుక్‌లో వర్ణ వివక్షకు గురవుతున్నానని బహిరంగ లేఖను రాశారు. శారదా మురళీధరన్‌ 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి. కొద్దినెలల క్రితమే కేరళ చీఫ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. తన భర్త తర్వాత ఆ స్థానంలో శారద నియమితులవడం విశేషం. వారిద్దరిని గమనించిన పలువురు రంగు గురించి చేసిన కామెంట్లు ఆమె దృష్టికి వచ్చాయి. నా రంగును నేను అంగీకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే నేను ఒక పోస్టు చేశాను. ఆ తర్వాత వచ్చిన కామెంట్లతో కాస్త కంగారుకు గురై.. దానిని తొలగించాను. అయితే నేను పేర్కొన్న అంశాలు చర్చించాల్సినవేనని నా శ్రేయాభిలాషులు చెప్పడంతో మళ్లీ తిరిగి షేర్ చేశాను అని తాను డిలీట్ చేసిన మాటలను తిరిగి పంచుకున్నారు.

వర్ణ వివక్షపై కేరళ సీఎస్‌

కానీ నలుపును ఎందుకు అవమానించాలి

ఒక సీనియర్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంతకుముందు ఆ స్థానంలో ఉన్న భర్తతో పోలికలు తీసుకొచ్చారు. అదేదో సిగ్గుపడాల్సిన విషయం అన్నట్టు.. అది అసలు మంచి కాదన్నట్టు.. నా రంగు గురించి మాట్లాడారు. కానీ నలుపును ఎందుకు అవమానించాలి. అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం. వర్షానికి ముందు కనిపించే వాగ్దానం. సాయంత్రానికి సూచిక.. అసలు అది లేనిదెక్కడ అంటూ రాసుకొచ్చారు. అలాగే చిన్నతనంలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించారు. ఈ రంగు చిన్నప్పుడే నేను పెద్ద మాటలు పలికేలా చేసింది. మళ్లీ నన్ను తన గర్భంలోకి తీసుకెళ్లి తెల్లగా, అందంగా తీసుకురాగలవా అని నాలుగు సంవత్సరాల వయసులో నేను నా తల్లిని అడిగేంతలా. ఆ రంగు ప్రభావం నాపై 50 ఏళ్లపాటు కొనసాగింది. నలుపునకు విలువ లేదనే భావనలో తెలుపు పట్ల ఆకర్షితురాలినయ్యా. దానివల్ల నేను తక్కువ వ్యక్తిగా భావించా. కానీ నా పిల్లలు ఆ వర్ణం అద్భుతమని, అందమైనదని నేను గుర్తించేలా చేశారు అంటూ వివరించారు.

నా తల్లి కూడా నల్లటి ఛాయను కలిగిఉండేది

వ్యక్తిగతంగా తనకు ఎదురైన అనుభవాలను ఇలా బహిరంగంగా పంచుకోవడం పట్ల శారద ను అంతా అభినందిస్తున్నారు. కేరళలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ స్పందిస్తూ.. ఆమె వెలిబుచ్చిన ప్రతిమాట హృదయాన్ని తాకింది. నా తల్లి కూడా నల్లటి ఛాయను కలిగిఉండేది. ఇది చర్చించాల్సిన అంశం అని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇక శారద విషయానికొస్తే.. ఆమె గతంలో పలు కీలక హోదాల్లో విధులు నిర్వర్తించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్‌లో సీఓఓగా, కుడుంబశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కేరళ చరిత్రలో తొలిసారి భర్త నుంచి ఆమె చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆ నియామకం అందరి దృష్టిని ఆకర్షించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870