📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Kerala: కేర‌ళ సీఎం కార్యాల‌యానికి బాంబు బెదిరింపు

Author Icon By Sharanya
Updated: April 28, 2025 • 2:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేరళలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం మరియు రాష్ట్ర సచివాలయం, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాలకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయని అధికార వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ దళాలు, బాంబ్ స్క్వాడ్‌లు అత్యవసరంగా స్పందించి ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.

గత రెండు వారాలుగా కొనసాగుతున్న బాంబు బెదిరింపు

గత రెండు వారాలుగా కేరళలో వరుసగా ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 12 బాంబు బెదిరింపులు నమోదయ్యాయి. కేర‌ళ హైకోర్టు స‌హా జిల్లా క‌లెక్ట‌రేట్‌లు, రెవెన్యూ డివిజ‌న‌ల్ కార్యాల‌యాల‌కు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. నిన్న, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్‌లు టెర్మినల్‌లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో కూడా తనిఖీలు సాగాయి. అయితే, ఇప్పటివరకు ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అధికారులు వీటిని నకిలీ బెదిరింపు కాల్స్గా గుర్తించారు.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం

మరికొన్ని రోజుల్లో అంటే మే 2న ప్రధాని నరేంద్ర మోదీ కేరళను సందర్శించనున్నారు. ప్రధానిగా రాష్ట్ర పర్యటనకు ముందు ఇలాంటి నకిలీ బెదిరింపులు రావడం పోలీసు శాఖను తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. భద్రత చర్యలు మరింత కఠినతరం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం హై అలర్ట్‌లో ఉంది. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ నేప‌థ్యంలో ఈ న‌కిలీ కాల్స్ పై పోలీసులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేశారు. 

Read also: Modi condolence: వ్యాన్ ప్రమాదంలో మరణించిన మృతులకు ప్రధాని సంతాపం

#bombthreat #CMOfficeThreat #Kerala #KeralaCM #KeralaCMOffice #KeralaUpdates #SecurityAlert Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.