📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Latest Telugu News: Kavitha: గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని సిజెఐకి కవిత లేఖ

Author Icon By Vanipushpa
Updated: October 23, 2025 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో ఇటీవలే నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్న గ్రూప్-1 పరీక్షపై తీవ్ర దుమారం రేగింది. ఈ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం సంచలనంగా మారింది. గ్రూప్-1 నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, రాష్ట్రపతి ఉత్తర్వులను సైతం ఉల్లంఘించారని ఆమె తన లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని కవిత తన లేఖ ద్వారా సీజేఐని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో 562 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసిన నేపథ్యంలో కవిత ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Visa: కొత్త విధానంలో వీసా మార్పులతో స్వాగతం పలుకుతున్న కెనడా

sp

తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం

గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు కవిత వెల్లడించారు. ప్రశ్నాపత్రాల అనువాదంలో (ట్రాన్స్‌లేషన్) లోపాల వల్ల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సమాధాన పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, దీంతో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు వచ్చాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆమె తెలిపారు. అంతేకాకుండా, ప్రిలిమ్స్ పరీక్షకు ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ పరీక్షకు మరో హాల్ టికెట్ నంబర్ కేటాయించడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

CJI Education News Examination Controversy Group 1 Exam Judicial Appeal kavitha Latest News Breaking News Telangana politics Telugu News TSPSC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.