हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Kaushalendra Pratap Singh: కొండచరియలు విరిగిపడి హనీమూన్ కు వెళ్లిన జంట గల్లంతు

Sharanya
Kaushalendra Pratap Singh: కొండచరియలు విరిగిపడి హనీమూన్ కు వెళ్లిన జంట గల్లంతు

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రానికి చెందిన నూతన దంపతులు కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ (Kaushalendra Pratap Singh) మరియు అంకితా సింగ్‌ తమ కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాలని మే 24న హనీమూన్‌ కోసం సిక్కింకు బయలుదేరారు. కొత్త దంపతులుగా వారు కలలు కనే ఆనందయాత్ర ఒక్కసారిగా విషాదంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు.

Kaushalendra Pratap Singh: కొండచరియలు విరిగిపడి హనీమూన్ కు వెళ్లిన జంట గల్లంతు

మే 29న జరిగిన ఘోర ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్‌సింగ్‌కు, అంకితా సింగ్‌ అనే యువతితో మే 5వ తేదీన వివాహం జరిగింది. అనంతరం, వీరు తమ హనీమూన్‌ కోసం మే 24న సిక్కింకు బయలుదేరారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న వారి ప్రయాణంలో మే 29న ఊహించని ప్రమాదం జరిగింది. వారు పర్యటనలో భాగంగా ప్రయాణిస్తున్న కారుపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనం అదుపుతప్పి దాదాపు 1,000 అడుగుల కిందనున్న తీస్తా నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో నవ దంపతులతో పాటు మరో తొమ్మిది మంది ఉన్నట్లు తెలిసింది.

సహాయక చర్యలు – ఇప్పటికీ కొనసాగుతున్న గాలింపు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, యాత్రికులు సహాయక చర్యలు ప్రారంభించారు. వారి ప్రయత్నంతో ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే, కారు డ్రైవర్‌ మృతి చెందాడు. నవ దంపతులు కౌశలేంద్ర, అంకితతో పాటు మరో ఆరుగురు పర్యాటకుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

గల్లంతైన ఈ ఎనిమిది మంది కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌), అగ్నిమాపక శాఖ, అటవీ శాఖకు చెందిన బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోందని అధికారులు వెల్లడించారు.

గల్లంతైన వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు

గల్లంతైన ఎనిమిది మంది ప్రయాణికుల్లో కౌశలేంద్ర మరియు అంకిత సింగ్‌తో పాటు నలుగురు ఒడిశాకు చెందినవారు, ఇద్దరు త్రిపురకు చెందినవారు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటన వారు ఊహించని విషాదాన్ని తెచ్చింది.

బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన

ప్రమాదం జరిగిన 12 రోజులు గడిచినా తమ కుమారుడు మరియు కోడలి ఆచూకీ లభించకపోవడంతో కౌశలేంద్ర తండ్రి షేర్ బహదూర్ సింగ్ తీవ్రంగా కలత చెందారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను, సిక్కిం ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.

Read also: Raja Raghuvanshi: కోడలే మా కుమారుడిని హతహమార్చిందంటూ తల్లి ఆవేదన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870