📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Karur stampede: కరూర్ తొక్కిసలాట.. విజయ్ తీరును తప్పుబట్టిన బాధితురాలు

Author Icon By Aanusha
Updated: October 29, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని కరూర్‌లో (Karur stampede) జరిగిన తొక్కిసలాట ఘటనలో భర్తను కోల్పోయిన ఓ మహిళ టీవీకే అధినేత, నటుడు విజయ్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.. సెప్టెంబర్ 27న టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన సభలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో రమేశ్ అనే వ్యక్తి కూడా ఒకరు. ఇప్పుడు అతడి భార్య చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి.

Read Also: Weather Red Alert : మోంతా తుపాను దెబ్బకు ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు

తమకు డబ్బు ముఖ్యం కాదని చెబుతూ విజయ్ తమ ఖాతాలో జమ చేసిన రూ.20 లక్షలను తిప్పి పంపించింది. విజయ్ నుంచి తాము ఓదార్పు కోరుకున్నాం తప్ప డబ్బు కాదని చెప్పారు.తొక్కిసలాట జరిగిన కొద్ది రోజులకు విజయ్ తమతో వీడియో కాల్ లో మాట్లాడారని రమేశ్ భార్య సంఘవి తెలిపారు.

నేరుగా వచ్చి పరామర్శిస్తానని, ముందుగా పరిహారం తీసుకోవాలని విజయ్ (Vijay) కోరారన్నారు. ఈ నెల 18న తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తరఫున తమ బ్యాంకు ఖాతాలో రూ.20 లక్షలు జమ అయిందని వివరించారు.

Karur stampede

విజయ్ పరామర్శ కోసం ఎదురుచూశామని

అయితే, తమకు డబ్బు ముఖ్యం కాదని, విజయ్ పరామర్శ కోసం ఎదురుచూశామని సంఘవి చెప్పారు.తాజాగా కరూర్ తొక్కిసలాట (Karur stampede) బాధిత కుటుంబాలను విజయ్ చెన్నై (Chennai) కి పిలిపించుకుని ఓ రిసార్ట్ లో సమావేశమయ్యారని సంఘవి గుర్తుచేశారు. ఆ సమావేశానికి తాము వెళ్లలేదని, తమ పేరు చెప్పుకుని తమ బంధువులు వెళ్లారని సంఘవి ఆరోపించారు.

విజయ్ పరామర్శిస్తారని భావిస్తే డబ్బు పంపారని, ఆ డబ్బు తమకు అక్కర్లేదని తిప్పి పంపామని సంఘవి వివరించారు. డబ్బు తిప్పి పంపిన రశీదును ఆమె మీడియాకు చూపించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

KarurStampede latest news Telugu News TVKParty vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.