📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Karnataka: ఇదేం పిచ్చి? బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తకు విడాకులు..

Author Icon By Tejaswini Y
Updated: January 31, 2026 • 2:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Karnataka: (దొడ్డబళ్లాపుర) సాకులు వెతకడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కానీ, కర్ణాటకలో ఓ మహిళ భర్తకు విడాకులు ఇవ్వడానికి చెప్పిన కారణం విని పోలీసులు సైతం అవాక్కయ్యారు. తన భర్తకు బుల్లెట్ బైక్ నడపడం రాదనే వింత నెపంతో సంసారాన్ని వదిలేసిన ఆమె, ఆపై వరుస పెళ్లిళ్లతో ముగ్గురు వ్యక్తులను బురిడీ కొట్టించింది.

Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

Karnataka: Husband gets divorced for not being able to ride a bullet bike..(filed pic)

వింత సాకుతో విడాకులు

పోలీసుల వివరాల ప్రకారం.. దొడ్డబళ్లాపుర ప్రాంతానికి చెందిన సుధారాణికి గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, తన భర్తకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ నడపడం రాదని, అది తనకు ఇష్టం లేదని గొడవ పెట్టుకుంది. ఇదే కారణంతో మొదటి భర్తను, కన్న పిల్లలను వదిలేసి బయటకు వచ్చేసింది. మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమె అనంతమూర్తి అనే వ్యక్తిని ట్రాప్ చేసి రెండో పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులు కాపురం చేసిన తర్వాత అసలు స్వరూపం బయటపెట్టింది. అతని వద్ద నుంచి ఏకంగా రూ. 20 లక్షల నగదును కాజేసి పరారైంది.

మూడో వ్యక్తికి వల.. పోలీసులకు ఫిర్యాదు

అనంతమూర్తిని ముంచిన తర్వాత సుధారాణి చూపు కనకపురకు చెందిన మరో వ్యక్తిపై పడింది. అతడిని కూడా తన మాయమాటలతో లొంగదీసుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఆమె మోసాలను గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు వ్యక్తులను మోసం చేసిన ఈ ‘కిలాడీ లేడీ’పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం బుల్లెట్ బైక్ రాదన్న కారణంతో మొదలైన ఆమె మోసాల పర్వం ఇప్పుడు కటకటాల వరకు చేరింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bullet Bike Divorce Doddaballapura News Karnataka Kiladi Lady Sudharani Fraud Case Viral News Karnataka

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.