Karnataka: సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చిన సిద్దరామయ్య

Read Time:  1 min
Karnataka: సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చిన సిద్దరామయ్య
FONT SIZE
GET APP

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై గత కొంతకాలంగా ఉన్న ఉత్కంఠను సిద్దరామయ్య(Siddaramaiah) అణచివేశారు. (Karnataka) అసెంబ్లీ వేదికపై, డీకే శివకుమార్‌తో ఎలాంటి పవర్ షేరింగ్ ఒప్పందం లేదని ఆయన ప్రకటించారు. “నేను పూర్తిగా ఐదేళ్ల పాటు సీఎం గా కొనసాగుతానని” స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా తనకే మద్దతుగా ఉందని సిద్దరామయ్య తెలిపారు. సిద్దరామయ్య మాట్లాడుతూ, గతంలో కూడా నేను పూర్తి ఐదేళ్ల వరకు ముఖ్యమంత్రిగా బాధ్యత వహించాను. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాను. నా అభిప్రాయం ప్రకారం అధిష్టానం నా పక్షాన ఉంది. పదవిని రెండు భాగాలుగా పంచుకోవాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని పేర్కొన్నారు.

Read also: Increased Security : నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

Karnataka: సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చిన సిద్దరామయ్య
Siddaramaiah has given clarity on the change of Chief Minister.

సిద్దరామయ్య-శివకుమార్ మధ్య విభేదాలు

2023లో కాంగ్రెస్(Karnataka) అధికారంలోకి వచ్చిన తర్వాత, సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రిత్వం పంచుకోవడం గురించి ప్రచారం జరిగింది. ఈ ప్రకారం, మధ్యంతర మార్పు జరగవచ్చని డీకే శివకుమార్ వర్గం ఆశించింది. అయితే, సిద్దరామయ్య తాజా వ్యాఖ్యలతో ఆ ఆశలపై నీళ్లు చల్లాయి. గత గురువారం రాత్రి మంత్రి సతీశ్ జార్కిహోళి ఇచ్చిన విందుకు సిద్దరామయ్య, ఆయనకు సన్నిహితులైన కొందరు మంత్రులు హాజరయ్యారు. ఈ విందుకు డీకే శివకుమార్‌కు ఆహ్వానం రాకపోవడం వివాదానికి దారి తీసింది. అయితే, ఈ వివాదంపై శివకుమార్, “విందులో పాల్గొనడంలో ఏమీ తప్పు లేదు” అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సిద్దరామయ్య, 2028 ఎన్నికల్లో డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కొన్ని ఊహాగానాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.