పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు మన ఇంటి కరెంట్ మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల సహజ వాయువు (Natural Gas) సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీని ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ‘నేచురల్ గ్యాస్ సప్లై రెగ్యులేషన్ ఆర్డర్ 2026’ను అమలులోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనల వల్ల కర్ణాటకలోని ఏకైక గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రంపై వేటు పడింది.
Read Also: Covid Vaccine Side Effects: కొవిడ్ టీకా మరణాల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ప్రస్తుత గ్యాస్ కొరత దృష్ట్యా..
బెంగళూరు (Bengaluru) నగర పరిధిలో ఉన్న 370 మెగావాట్ల సామర్థ్యం గల యలహంక గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్కు గ్యాస్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. మార్చి 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచే ఈ ప్లాంట్ పని చేయడం ఆగిపోయింది. కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (KPCL) నిర్వహిస్తున్న ఈ ప్లాంట్ రాష్ట్ర అవసరాలకు ఎంతో కీలకం. అయితే కేంద్రం విడుదల చేసిన ప్రాధాన్యత జాబితాలో విద్యుత్ రంగానికి అత్యల్ప ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ప్లాంట్ కు అందాల్సిన గ్యాస్ నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగానికి మాత్రమే గ్యాస్ కేటాయించాలని నిర్ణయించింది. ఈ జాబితాలో వంట గ్యాస్ (PNG/LPG), రవాణా ఇంధనం (CNG), ఎరువుల కర్మాగారాలు , పారిశ్రామిక వినియోగదారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వీరందరికీ సరఫరా చేసిన తర్వాతే విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల బెంగళూరు (Bengaluru) లోని ఈ కీలక ప్లాంట్కు గ్యాస్ అందకుండా పోయింది. ప్రస్తుతానికి కర్ణాటక రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రోజుకు సుమారు 355 మిలియన్ యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ డిమాండ్ను థర్మల్, జలవిద్యుత్, సోలార్ , ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం ద్వారా భర్తీ చేస్తోంది. అయితే యలహంక ప్లాంట్ నిలిచిపోవడం వల్ల స్వల్ప స్థాయిలో అంతరాయాలు కలిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: