Karnataka missing woman : కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఓ యువతి అదృశ్యమైన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తుమకూరు జిల్లా కుణిగల్కు చెందిన 29 ఏళ్ల ప్రియాంక చిక్కమగళూరులో జరిగిన పెళ్లికి హాజరై తిరుగు ప్రయాణంలో కనిపించకుండా పోయింది. ఫిబ్రవరి 12 రాత్రి బేలూరు బస్టాండ్ సమీపంలో ఆమె చివరిసారిగా కనిపించినట్లు సమాచారం.
అదే సాయంత్రం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి “నాతో పాటు ఇంకొకరు ఉన్నారు” అని చెప్పి కాల్ కట్ చేయడం అనుమానాలకు దారితీసింది. ఆ తర్వాత ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ అయింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఆలస్యంగా స్పందించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Winter Olympics: ఒలింపిక్స్ లో కండోమ్స్ కొరత
కల్కెరే ప్రాంతంలో ప్రియాంకకు చెందిన దుస్తులు, చెప్పులు, వ్యానిటీ బ్యాగ్ వేర్వేరు చోట్ల లభించడంతో కేసు మరింత గంభీరంగా మారింది. అదృశ్యమైన సమయంలో ఆమె సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలు ధరించి ఉన్నట్లు తెలుస్తోంది. నగల కోసం దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును అరెహళ్లి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలతో కలిసి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ ప్రియాంక ఆచూకీ కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: