కర్నూలు బస్సు దుర్ఘటనపై తీవ్ర స్పందన డీకే శివకుమార్ విచారణ డిమాండ్
కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని రేపింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవదహనమై(Karnataka) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషాదానికి నిర్లక్ష్యం లేదా కుట్ర కారణమై ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ, ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ శివకుమార్, గత వారం కూడా ఇలాంటి ఘటన జరిగింది.
బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. అప్పుడు ప్రజల అప్రమత్తత వల్ల 20 మంది వైద్య విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ అధికారులు అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే, ఈరోజు ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగేది కాదు అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ప్రమాదంపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మరియు హోం మంత్రి జి. పరమేశ్వర దృష్టి సారించాలని ఆయన ఆదేశించినట్లు తెలిపారు. అలాగే, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read also: బస్సు ప్రమాదం పై 16 బృందాలతో దర్యాప్తునకు ఆదేశం..అనిత

ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడి ఆవేదన
ఈ దుర్ఘటనలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వేణు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో(Karnataka) జరిగిన భయానక దృశ్యాలను గుర్తుచేసుకుంటూ, బస్సు ఆగిన కొద్దిసేపటికే ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. ఊపిరి ఆడకుండా పోయింది. ఒక ప్రయాణికుడు అద్దాన్ని పగలగొట్టి 15 మందిని బయటకు తీసేందుకు సహాయపడ్డాడు. కానీ మిగతా వారిని కళ్లముందే మంటల్లో కాలి చనిపోతుంటే ఏమీ చేయలేకపోయాం అని వేణు వేదనతో చెప్పాడు.
సోదరిని చూసి తిరిగి బెంగళూరుకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వేణు వివరించాడు. బస్సు ముందుగా ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి తర్వాత మంటల్లో చిక్కుకుంది. మేము బయటకు వచ్చిన కొద్దిసేపటికే మొత్తం బస్సు మంటల్లో మునిగిపోయింది అని అతను తెలిపాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: