కర్ణాటకలోని బీదర్ జిల్లా, మొల్కేరా గ్రామంలో శనివారం (జనవరి 31) పెద్ద పెళ్లుళ్లు సంభవించాయి. ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం 8 మంది గాయపడ్డారు. ఘటన మొలిగే మారయ్య ఆలయంకు వెళ్తున్న రోడ్డుపై(Karnataka BombBlast) చోటుచేసుకుంది. నడిచే సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. గాయపడ్డ వారిలో పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఘటన స్థలానికి బాంబ్ స్క్వాడ్ మరియు పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Gujarat crime: కన్న కూతురిపై 45 ఏళ్ల తండ్రి అత్యాచారం..
పేలుడికి కారణం: భూమిలో పాతిపెట్టిన వస్తువు
ప్రాథమిక దర్యాప్తులో, భూమిలో పాతిపెట్టిన కెమికల్స్తో కూడిన వస్తువు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఐతే, కుట్రా కోణం కూడా ఉందో లేదో అనే అంశంపై పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. మొలిగే మారయ్య ఆలయం సమీపంలో గత ఆరు నెలల్లో(Karnataka BombBlast) ఐదోసారి ఈ విధమైన పేలుడు సంభవించటంతో స్థానికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. భద్రతా వాహినీలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం స్పందన
కర్ణాటక ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. మంత్రి ఈశ్వర్ కాండ్రే ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, అసలు పదార్ధాలను ఎవరు, ఎందుకు తీసుకొచ్చారు అనే విషయాలపై పోలీసులను కృషి చేయమని ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: