📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Karnataka : హనీ ట్రాప్‌ వ్యవహారం..రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ

Author Icon By sumalatha chinthakayala
Updated: March 21, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Karnataka : కర్ణాటక అసెంబ్లీని హనీ ట్రాప్‌ వ్యవహారం కుదిపేసింది. కేంద్ర మంత్రులతో సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నట్టు కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న గురువారం రాష్ట్ర అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమస్య ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాదని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయాన్ని నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ నేతలు లేవనెత్తారు. హనీట్రాప్‌ వ్యవహారంపై చర్చకు పట్టుబడ్డారు.

తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు

ప్రభుత్వ టెండ‌ర్లలో ముస్లిం కాంట్రాక్టర్ల ‌ కు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని చెబుతోంది. దీంతో సభ రణరంగంగా మారింది. హనీ ట్రాప్‌పై విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్‌ చేయడాన్ని విమర్శిస్తూ.. స్పీకర్‌ చుట్టూ చేరి నిరసన తెలిపారు. తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు ప్రతులను చించి స్పీకర్‌పై వేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

క్యాట‌గిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్టర్లు

ప్రభుత్వ టెండ‌ర్లలో ముస్లిం కాంట్రాక్టర్ల కు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు క‌ర్ణాట‌క స‌ర్కారు నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం రూపొందించిన బిల్లుకు గత వారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క‌ర్నాట‌క ట్రాన్స్‌ప‌రెన్సీ ఇన్ ప‌బ్లిక్ ప్రొక్యూర్మెంట్ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ తీసుకురానున్నారు. కేటీపీపీ చ‌ట్టంలో క్యాట‌గిరీ 2బీ కింద రిజ‌ర్వేష‌న్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నట్లు సీఎం సిద్ధరామ‌య్య అసెంబ్లీలో ప్రక‌టించారు. క్యాట‌గిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్టర్లు ఉంటార‌న్నారు. క్యాట‌గిరీ 1 కింద ఎస్సీ, ఎస్టీలు, క్యాట‌గిరీ 2ఏ కింద వెనుక‌బ‌డిన త‌రగ‌తులు వారుంటారు.

Breaking News in Telugu Google news Google News in Telugu honey trap Karnataka Latest News in Telugu Muslim Quota Bill Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.