📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Kangana: కంగనా వివాదం: “నా దగ్గర డబ్బుల్లేవు, పదవిలేదు” వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

Author Icon By Vanipushpa
Updated: July 7, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో వరద బాధితులను ఉద్దేశించి మండి ఎంపీ, నటి కంగనా రనౌత్(Kangana Ranaut) చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. సాయం చేయడానికి తన వద్ద విపత్తు నిధులు గానీ, కేంద్రమంత్రి పదవి గానీ లేవంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్రంగా మండిపడింది. అయితే, తాను వాస్తవ పరిస్థితులనే వివరించానని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన వ్యాఖ్యలను వక్రీకరిస్తోందని కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఒక్క మండి జిల్లాలోనే మృతుల సంఖ్య 75కు చేరింది. ఈ నేపథ్యంలో ఆదివారం తన నియోజకవర్గంలోని తునాగ్ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో కంగన పర్యటించారు.

విపత్తు నిధులు లేవు: కంగనా రనౌత్

ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడుతూ “కుటుంబాలను ఆదుకోవడానికి నా దగ్గర తక్షణమే ఇచ్చేందుకు విపత్తు నిధులు లేవు. నేను క్యాబినెట్ మంత్రిని కూడా కాదు” అని వ్యాఖ్యానించారు. అయితే, కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రజలను ఓదార్చాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారిని మరింత బాధపెట్టడమేనని విమర్శించాయి.

Kangana: కంగనా వివాదం: “నా దగ్గర డబ్బుల్లేవు, పదవిలేదు” వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత

ఈ విమర్శలపై కంగన ఘాటుగా స్పందించారు. “ఒక ఎంపీగా నేను ఏం చేయగలనో, నాకున్న పరిమితులేంటో ప్రజలకు స్పష్టంగా చెప్పాను. నిధులు లేనప్పుడు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత. కానీ, బాధితులను ఆదుకోవడం మానేసి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నా మాటలపై తప్పుడు ప్రచారం చేస్తోంది” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఎలాంటి సహాయం చేయడం లేదని కూడా ఆమె ఆరోపించారు.

హిమాచల్ వరదలపై కంగనా పర్యటన
ఇటీవల భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో అనేక జిల్లాలు మునిగిపోయాయి.
మండి జిల్లాలో మాత్రమే 75 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ పరిస్థితుల్లో తునాగ్ నియోజకవర్గంలో కంగనా రనౌత్ పర్యటించారు, ప్రజలతో మాట్లాడారు .

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: టెస్టు సిరీస్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

Breaking News Himachal floods Kangana Himachal Pradesh disaster relief Kangana controversy Kangana Ranaut floods Kangana Ranaut MP statement latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.