📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Kangana Ranaut : ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు కుట్ర చేస్తున్నాయి .. కంగనా రనౌత్‌

Author Icon By Sudha
Updated: February 10, 2026 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతిపక్ష పార్టీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాయని, పార్లమెంట్‌లో జరుగుతున్న పరిణామాలను చూసి దేశం సిగ్గుపడుతోందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె విపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిన్న (సోమవారం) లోక్‌సభలో రాహుల్ గాంధీ ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ప్రచురితం కాని పుస్తకంలోని అంశాలను చట్టవిరుద్ధంగా ప్రస్తావించారని కంగనా ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ నిన్న ఒక అనధికారిక, చట్టవిరుద్ధమైన పుస్తకాన్ని సభకు తీసుకొచ్చి మొత్తం న్యాయవ్యవస్థను అవమానించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ కూడా స్పష్టంచేసింది’ అని కంగనా అన్నారు. ఈ పరిణామాలతో ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు కుట్ర చేస్తున్నాయని కంగనా (Kangana Ranaut)ఆరోపించారు.

Read Also : http://Pradhanmantri UjjwalaYojana: మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు

Kangana Ranaut

‘ప్రతిపక్ష ఎంపీలు సభలో కాగితాలు చించి స్పీకర్‌పై విసరడం, టేబుళ్లపైకి ఎక్కడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు ప్రధాని మోదీ చేతిలో నుంచి కాగితాలు లాక్కోరని, ఆయనపై దాడి చేయరని గ్యారెంటీ ఏంటి..? ప్రధాని సభకు రావాలంటే మాకు దీనిపై హామీ కావాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. మహిళా ఎంపీలను అడ్డుపెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడితే పార్లమెంట్ గౌరవం ఏమవుతుందని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరగనీయకుండా విపక్షాలు సభలో గందరగోళం సృష్టించడంతో లోక్‌సభ మంగళవారం కూడా వాయిదా పడింది. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేయగా, బడ్జెట్‌పై చర్చకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వారిని కోరారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Indian Politics Kangana Ranaut Kangana Ranaut Statement opposition parties PM Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.