Rajya sabha speech : Kamal Haasan రాజ్యసభలో తన తొలి ప్రసంగంతో సభ్యుల దృష్టిని ఆకర్షించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా Rajya Sabhaలో మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యం, అధికారం, యువత భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
“ప్రభుత్వాలు శాశ్వతం కావు… అధికారం కూడా శాశ్వతం కాదు” అంటూ కమల్ హాసన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల నుంచి వచ్చిన వ్యక్తులు ప్రజల గొంతుకగా పార్లమెంట్లోకి వస్తారని, తనకు మాత్రం సినిమా ద్వారానే ఈ అవకాశం లభించిందని చెప్పారు. తన రాజకీయ ప్రయాణానికి మద్దతుగా నిలిచిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Ranveer Singh: ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్పై కేసు నమోదు!

ద్రావిడ ఉద్యమ నేతలు పెరియార్, అన్నాదురై, అలాగే మహాత్మా గాంధీ ఆలోచనలు తనపై గాఢ ప్రభావం చూపాయని కమల్ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, హక్కుల పరిరక్షణలో రాజీ పడకూడదని, ప్రజాస్వామ్యం ప్రజలను అణచివేయడానికి కాదు, ముందుకు నడిపించడానికి ఉపయోగపడాలన్నారు.
“జెన్-జీ తరం మనల్ని గమనిస్తోంది. ప్రగతిశీల ప్రజాస్వామ్యంతో పాటు యువత ఎదగాలి. అదే దేశ భవిష్యత్తు” అంటూ యువతకు ఆయన పిలుపునిచ్చారు. కమల్ హాసన్ తొలి ప్రసంగం సభలో మంచి స్పందనను అందుకుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: