📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

K. Narayana: సంక్షేమ పథకాల నుంచి కుట్రపూరితంగా గాంధీ పేరు తొలగింపు

Author Icon By Saritha
Updated: December 29, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిపిఐ జాతీయ నేత నారాయణ

హైదరాబాద్ : (K. Narayana) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ(BJP) నేతలు జాతి పిత మహాత్మాగాంధీ పేరును సంక్షేమ పథకాల నుంచి కుట్రపూరితంగా తొలగిస్తున్నారని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షులు డాక్టర్ కె నారాయణ విమర్శించారు. అహింస, లౌకికత్వం, సామాజిక న్యాయం వంటి గాంధీయ విలువలను బలహీనపరుస్తూ, స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉండి, ఆ పోరాటాన్ని వ్యతిరేకించిన శక్తులు నేడు తమకు అనుకూలంగా చరిత్రను వక్రీకరిస్తూ తిరగరాయడం దురదృష్టకరమని, (K. Narayana) ఇది భారతదేశ ప్రతిష్టకు అవమానకరమన్నారు. నాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిందెవరు? నేడు అనాలోచితంగా కీర్తించబడుతున్నదెవరని ప్రశ్నించారు.

Read also: TG Weather: జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి

Gandhi’s name is being deliberately removed from welfare schemes.

సంక్షేమ పథకాల నుంచి గాంధీ తొలగింపు పై విమర్శ

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. అది కోట్లాది మంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన దశాబ్దాల త్యాగపోరాట ఫలితం. ఈ పోరాటానికి నాయకత్వం వహించినవారు జాతిపిత మహాత్మా గాంధీ. కానీ కొందరు చెబుతున్న మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి 1924 డిసెంబర్ 25న జన్మించారు. (K. Narayana)స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయన వయస్సు 22 సంవత్సరాలు మాత్రమేనని, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఏ ప్రధాన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లోనూ ఆయన పాల్గొన్నట్లు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవన్నారు. అయినప్పటికీ నేడు దేశమంతటా వాజ్ పేయి విగ్రహాలు ఏర్పాటు చేయటం, రహదారులు, చూస్తున్నామన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నాయకులుగా చలామణి అయిన వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా చిత్రీకరించే దుస్థితి దాపురించిందన్నారు.

అంతేకాకుండా మహాత్మా గాంధీ పేరును సంక్షేమ పథకాల నుంచి కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశానికి స్వాతంత్రం ఎవరు దానం చేయలేదని, అనేక ప్రాణత్యాగాలతో సాధించ బడిందన్నారు. (K. Narayana) పలు సంస్థలు, ప్రజా స్థలాలు, పథకాల పేర్లలో మార్పులు చేయడం వంటి చర్యలను మనం ప్రస్తుత రాజకీయ భావజాలాలకు అనుగుణంగా గత చరిత్రను మార్చాలనుకోవటం అవివేకమన్నారు. మహాత్మ గాంధీని కేవలం విగ్రహాలకు మాత్రమే పరిమితం చేసి, ఆయన ఆలోచనలను ఆచరణలో లేకుండా చూడాలన్నదే నేటి పాలకుల అనాలోచిత విధానంగా గోచరిస్తుందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

BJP CPI Freedom Struggle Gandhi Historical Distortion Indian Independence K Narayana Latest News in Telugu MahatMa Gandhi Telugu News Welfare schemes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.