హైదరాబాద్ : పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సోమవారం ఆర్ట్ గ్యాలరీ సాంస్కృతిక కళాసారథి సంస్థల అధికారులతో మాదాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) మాట్లాడుతూ, ఆర్ట్ గ్యాలరీని సమర్థవంతంగా వినియోగిం చుకో వాల్సిన అవసరం ఉందని, దాని నిర్వ హణను మరింత మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. ఆర్ట్ గ్యాలరీని మరింత ప్రాచు ర్యంలోకి తీసుకురావడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
Read Also: Irfan Pathan: రోహిత్, కోహ్లీ దేశవాళీ క్రికెట్లో పాల్గొనాల్సిన అవసరం ఉందన్న ఇర్ఫాన్ పఠాన్
చిత్రకారులు, కళాకారులు(Artists) దీనిని మరింత సద్వినియోగం చేసుకునేలా, కళా ప్రియులు, ప్రజలు, పర్యాటకులు ఎక్కువగా సందర్శించేలా ప్రదర్శనలు, ఈవెంట్లు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. సాంస్కృతిక కళాసారథుల గురించి మాట్లాడుతూ, వారి వేతనాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళాకారుల సేవలకు గౌరవం ఇవ్వడం ప్రభుత్వ ధర్మమని, కళాసారథి కార్యాలయంలో ఉన్న ఆడియో-వీడియో స్టూడియోలో సౌండ్ ప్రూఫింగ్ ప్రత్యేక కార్యక్రమాలు, పనులను తక్షణమే చేపట్టాలని, అందుకొ అవసరమైన కన్సల్టెంట్ నిపుణుడి సేవ-వినియోగించుకోవాలని మంత్రి ఆదేశించా అంతకుముందు మంత్రి జూపల్లి ఆర్ట్ గ్యా-సాంస్క ృతిక కళాసారథి కార్యాలయా సందర్శించారు. ఈ సమీక్షలో ఆర్ట్ గ్యా డైరెక్టర్ లక్ష్మీ, భాషా, సాంస్కృతిక శాఖ డై నరసింహ రెడ్డి, సాంస్కృతిక కళాసా చైర్పర్సన్ వెన్నెల గద్దర్ పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: