📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మధ్యతరగతి వారికి ఉద్యోగాలు విడుదల..!

Author Icon By Divya Vani M
Updated: February 1, 2025 • 9:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర బడ్జెట్ 2025ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలుగు కవి గురజాడ అప్పారావు ప్రసిద్ధ వచనం “దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్”ను ప్రస్తావిస్తూ, దేశ అభివృద్ధి కోసం మోదీ సర్కార్ చేస్తున్న కృషి వివరించారు. ఈ సందర్భంగా, దేశవ్యాప్తంగా అభివృద్ధి చర్యలు చేపట్టడం, వివిధ రంగాలకు కేటాయింపులు పెంచడం ముఖ్యంగా ప్రస్తావించారు.మొత్తం మీద, బడ్జెట్‌లో కొన్ని కీలకమైన ప్రకటనలు వెలువడ్డాయి. మొదటగా, మధ్య తరగతి వారికి భారీగా పన్ను రీళీఫ్ ప్రకటించారు. 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇస్తూ, 12 లక్షలపై ఆధారపడి పన్ను శ్లాబులు పెట్టాలని తెలిపారు. 16-20 లక్షల ఆదాయం ఉన్న వారికి 20% పన్ను, 20-24 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 25%, 24 లక్షలపై 30% పన్ను విధించనున్నట్టు పేర్కొన్నారు.

ఇక, ఆరు కీలక రంగాలలో సమూల మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం ద్వారా 17 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు. అలాగే, కిసాన్ క్రెడిట్ రుణాలు పెంచడం, MSMEలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల రుణాలు అందించాలనేది కూడా కీలక నిర్ణయాలుగా ఉన్నాయి.విద్యారంగం పై కూడా బడ్జెట్‌లో పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. వైద్య రంగంలో గడిచిన 10 సంవత్సరాల్లో 1.01 లక్షల వైద్య సీట్లు పెంచినట్లు తెలిపారు.

రానున్న ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు కల్పిస్తామని ప్రకటించారు.2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.అదే విధంగా, మౌలిక వసతుల అభివృద్ధి కోసం 10,148 లక్షల కోట్లు కేటాయించారు. భారతీయ ఎగుమతుల కోసం కొత్త ‘న్యూ ఎక్స్‌పోర్ట్ మిషన్’ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.

2028 వరకు జల్ జీవన్ మిషన్‌ను కొనసాగిస్తామని, 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు అందించాలనేది కూడా ముఖ్య నిర్ణయంగా ఉంది.వ్యవసాయ రంగంపై కూడా పెద్ద పీట వేసారు. పప్పుదాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక, బిహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు, పత్తి రైతుల కోసం ఐదు సంవత్సరాల ప్రణాళికలు వంటి ముఖ్య నిర్ణయాలు ప్రకటించారు.ఇక, బీహార్‌కు పెద్ద కేటాయింపులు జరిగినాయి. మఖానా బోర్డు ఏర్పాటు, పాట్నా IIT విస్తరణ, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణం, 15 వేల కోట్లతో లక్ష ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులు ప్రకటించారు.

Agriculture in Budget 2025 Education Sector Budget 2025 Indian Budget 2025 Highlights Indian economy 2025 Middle Class Tax Relief Nirmala Sitharaman Budget PM Kisan Yojana Union Budget 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.