📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Jitan Ram Manjhi : బీహార్‌లో మళ్లీ ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కేంద్ర మంత్రి

Author Icon By Sudha
Updated: October 13, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష కూటమిలు సీట్ల షేరింగ్‌లో బిజీగా ఉన్నాయి. ఆదివారం ఎన్డీయే కూటమి సీట్ల షేరింగ్ ప్రక్రియను పూర్తిచేసింది. అందులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితన్‌రామ్‌ మాంఝీ (Jitan Ram Manjhi) నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్‌ మోర్చా పార్టీకి 6 స్థానాలు దక్కాయి.దీనిపై ఇవాళ జితన్‌ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi)స్పందించారు. మొత్తం 243 సీట్లలో తాము 15 సీట్ల కోసం డిమాండ్‌ చేశామని, కానీ కూటమి 6 సీట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. అయినా కూటమి నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని చెప్పారు. బీహార్‌ గొప్పగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం చేయడం కోసం తాము కృషి చేస్తామన్నారు. బీహార్‌లో మళ్లీ ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.

Jitan Ram Manjhi : బీహార్‌లో మళ్లీ ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కేంద్ర మంత్రి

కాగా బీహార్‌ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకుగాను ఎన్డేయే కూటమిలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ తలా 101 స్థానాల్లో బరిలో దిగుతున్నాయి. మిగిలిన 41 స్థానాల్లో చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ 29 స్థానాల్లో పోటీచేయనుంది. మిగిలిన 12 స్థానాల్లో హిందుస్థానీ అవామ్‌ మోర్చా, రాష్ట్రీయ లోక్‌ మోర్చా పార్టీలు ఆరేసి స్థానాల్లో పోటీపడనున్నాయి.

జితన్ రామ్ మాంఝీ ఎవరు?

జితన్ రామ్ మాంఝీ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014 మే 20 నుండి 2015 ఫిబ్రవరి 20 వరకు బీహార్ 23వ ముఖ్యమంత్రిగా పని చేశాడు. జితన్ రామ్ మాంఝీ హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) వ్యవస్థాపక అధ్యక్షుడు. అతను అంతకుముందు నితీష్ కుమార్ మంత్రివర్గంలో షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమా శాఖ మంత్రిగా పని చేశాడు.

జితన్ రామ్ మాంఝీ రాజకీయ జీవితం ?

జితన్ రామ్ మాంఝీ బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రశేఖర్ సింగ్ , బిందేశ్వరి దూబే, సత్యేంద్ర నారాయణ్ సిన్హా, జగన్నాథ్ మిశ్రా, లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి మంత్రివర్గాలలో మంత్రిగా పని చేశాడు. మాంఝీ 1980 నుండి కాంగ్రెస్ (1980-1990), జనతాదళ్ (1990-1996), రాష్ట్రీయ జనతా దళ్ (1996-2005), జేడీయూ (2005–2015) నుండి శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఫిబ్రవరి 2015 రాజకీయ సంక్షోభం తరువాత జేడీయూ నుండి బహిష్కరించిన అనంతరం హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీని స్థాపించాడు. జితన్ రామ్ మాంఝీకి జూలై 2015లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ “Z” ప్లస్ సెక్యూరిటీని కల్పించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

https://vaartha.com/business/gst-2-0-jebuku-balam-gst-phalam/563751/

Bihar Politics BJP Breaking News Indian Politics Jitan Ram Manjhi latest news NDA Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.