ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అనుబంధ టెలికాం సంస్థ జియో (Jio IPO 2026) త్వరలోనే తన ప్రాథమిక షేర్ల పబ్లిక్ ఇష్యూ (IPO)ను మార్కెట్లోకి తీసుకురానుంది. (Jio IPO 2026) తొలి అర్ధభాగంలో జియో ఐపీఓ రానున్నట్లు రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ వార్షిక సాధారణ సమావేశం (RIL AGM)లో అధికారికంగా ప్రకటించారు. ఈ ఐపీఓ పెట్టుబడిదారులకు ఒక గొప్ప అవకాశం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
జియో ఎప్పటికీ తన ఐదు ప్రధాన హామీలకు కట్టుబడి ఉంటుందని అంబానీ చెప్పారు. ప్రతి భారతీయుడిని మొబైల్ మరియు హోమ్ బ్రాడ్బ్యాండ్తో కలుపుతుందని తెలిపారు. ప్రతి గృహానికి స్మార్ట్ హోమ్, జియో టీవీ ప్లస్, జియో టీవీ ఓఎస్ వంటి డిజిటల్ సేవలను అందిస్తామని వాగ్దానం చేశారు. వ్యాపార వేదికలను సురక్షితంగా డిజిటల్ వైపు మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతామని అన్నారు.
అలాగే, భారత్లో కృత్రిమ మేధ (AI) విప్లవాన్ని ముందుకు నడిపించడమే కాకుండా, జియో భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరించబోతుందని ప్రకటించారు.
జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, ప్రస్తుతం జియోకు 500 మిలియన్లకుపైగా కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ఈ సంఖ్య అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాల మొత్తం జనాభాకంటే ఎక్కువని గర్వంగా పేర్కొన్నారు.
2019లో జరిగిన AGMలో ముకేశ్ అంబానీ, తమ టెలికాం మరియు రిటైల్ వ్యాపారాలను ఐదు సంవత్సరాలలో లిస్టింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ అప్పటి నుంచి స్పష్టత లేక ఇన్వెస్టర్లు ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా చేసిన ప్రకటన పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహం నింపింది.
బ్రోకరేజీ సంస్థ సిటీ అంచనా ప్రకారం, జియో విలువ సుమారు 120 బిలియన్ డాలర్లు ఉండే అవకాశం ఉంది. ఈ ఐపీఓ విడుదలైతే, అది భారత్ చరిత్రలోనే అతిపెద్ద IPOలలో ఒకటిగా నిలిచే అవకాశముంది.
Read also :