జార్ఖండ్(Jharkhand)లో కురిసిన భారీ వర్షాలకు జన జీవనం అస్థవ్యస్తంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో ఝార్ఖండ్ తూర్పు సింగ్భూమ్ (Singhbhum)జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరద కారణంతో ఒక ప్రైవేటు పాఠశాల ప్రాంగణం నీట మునిగింది. మొత్తం 162 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు.
స్కూల్ పైకప్పులపైకి తరలించబడిన విద్యార్థులు
దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు (Teacher) విద్యార్థులను తొలుత భవనంపైకి తరలించారు. అనంతరం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF)సిబ్బందికి సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న రెస్య్యూ బృందాలు గ్రామస్థుల సహాయంతో విద్యార్థులను రక్షించాయి. హల్దిపోఖర్-కోవాలి రోడ్డులోని పండర్సోలి వద్ద ఉన్న పాఠశాలలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. పాఠశాల భవనం నీట మునిగిపోవడంతో, ఉపాధ్యాయులు విద్యార్థులందరినీ పైకప్పులపైకి తరలించారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో భారీ వర్షాలు
భారీ వర్షాల నేపథ్యంలో జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 30న ఖుంటి, రాంచీ, రామ్గఢ్, బొకారో, ధన్బాద్, సరైకేలా-ఖర్స్వాన్, వెస్ట్ సింగ్భూమ్లకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయబడింది. జూలై 1న గుమ్లా, గర్వా, పాలము, చత్రా, లతేహర్, లోహర్దాగాలకు జారీ చేయబడింది.
రెస్క్యూ బృందాల హుటాహుటిన చర్య
సమాచారం అందుకున్న వెంటనే (NDRF) & పోలీస్ (Police)బృందాలు స్పాట్కు చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. స్థానిక గ్రామస్తులు కూడా సహాయంతో అన్ని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసివచ్చారు.
వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ
జూన్ 30: ఖుంటి, రాంచీ, రామ్గఢ్, బొకారో, ధన్బాద్, సరైకేలా-ఖర్స్వాన్, వెస్ట్ సింగ్భూమ్. జూలై 1: గుమ్లా, గర్వా, పాలము, చత్రా, లతేహర్, లోహర్దాగా జిల్లాలకు అలర్ట్ జారీ. పలు ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో ప్రజలకు అనవసరంగా బయటకు రావద్దని సూచన. పాఠశాలలు, హాస్టల్స్ వద్ద అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read Also: Delhi: ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కృత్రిమ వర్షం.. ఏర్పాట్లు