దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇంజినీరింగ్ అభ్యర్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ (JEE Main) తుది విడత పరీక్షల తేదీలను ఎన్టీఏ (NTA – నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) అధికారికంగా ప్రకటించింది. 2025 ఏప్రిల్ 2 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులకు కీలకమైన పరీక్ష.
ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలు
పరీక్షా షెడ్యూల్ ప్రకారం, పేపర్-1 (బీఈ/బీటెక్ కోర్సులకు) పరీక్షలు ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న మధ్యాహ్నం మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ (Bachelor of Architecture) సీట్ల కోసం నిర్వహించే పేపర్-2ఎ, బి-ప్లానింగ్ (Bachelor of Planning) కోర్సులకు సంబంధించిన పేపర్-2బి పరీక్షలు ఏప్రిల్ 9న ఉదయం షిఫ్టులో జరుగుతాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి పరీక్ష తేదీలకు కొన్ని రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 17న జేఈఈ మెయిన్ పేపర్-1 ఫలితాలను విడుదల
పరీక్ష ఫలితాల విషయానికొస్తే, ఎన్టీఏ ఏప్రిల్ 17న జేఈఈ మెయిన్ పేపర్-1 ఫలితాలను విడుదల చేయనుంది. విద్యార్థులు తమ స్కోర్ కార్డులను అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరయ్యేందుకు అర్హులవుతారు. జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా దేశంలోని టాప్ ఐఐటీలు (IITs) మరియు ఇతర ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశ అవకాశాలను పొందొచ్చు.
ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు జేఈఈ మెయిన్ పరీక్ష ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ పరీక్షలో మెరుగైన స్కోర్ సాధించేందుకు విద్యార్థులు తగిన సిద్ధాంత, ప్రాక్టికల్ ప్రిపరేషన్ చేయాలి. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను పరిశీలించడంతో పాటు, మాక్ టెస్టులు రాస్తూ టైమ్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టడం అవసరం. పరీక్ష సమయానికి విద్యార్థులు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండటం కూడా ఎంతో ముఖ్యం.